ఛత్రపతి ఇంటర్వెల్ ఎంత మోసం చేశారు..?

ప్రభాస్ కెరీర్ లో ఛత్రపతి సినిమా ఎంత పెద్ద హిట్ అన్నది తెలిసిందే.

Update: 2024-09-13 14:30 GMT

ప్రభాస్ కెరీర్ లో ఛత్రపతి సినిమా ఎంత పెద్ద హిట్ అన్నది తెలిసిందే. బాహుబలికి ముందు ప్రభాస్ రాజమౌళి కలిసి చేసిన ఆ సినిమా మాస్ ఆడియన్స్ కు బాగా ఎక్కేసింది. ఆ సినిమాలో ప్రభాస్ మాస్ యూపోరియా ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. ఐతే ఛత్రపతి సినిమాలో ఇంటర్వెల్ సీన్ అంటే అందరికీ ఇష్టం. ఆ సీన్ ఎప్పుడు చూసినా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ అందిస్తాయి. ఐతే ఆ సీన్ వెనక ఉన్న ఒక గమ్మత్తైన విషయాన్ని ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పి షాక్ ఇచ్చారు ప్రభాస్.

ఛత్రపతి ఇంటర్వెల్ సీన్ లో బాజీరావుని చంపి అతని శవాన్ని అప్పలనాయుడు అదే మన కోటా గారి దగ్గరకు తీసుకెళ్లి సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత బయటకు వచ్చి జనాల ముందు మీసం తిప్పే ముందు డైలాగ్ చెబుతాడు. ఈ సీన్ లోని డైలాగ్స్ అన్నీ కూడా జనాలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రభాస్ వాయిస్ ఓపెన్ చేయలేకపోయాడట. రాజమౌళికి ఈ విషయం చెబితే సరే నువ్వు పెదాలు కదిలించమని అన్నాడట. ఆ తర్వాత డబ్బింగ్ లో డైలాగ్ చెప్పించారట.

క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ వారికి ఆ విషయం తెలియలేదని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు మిస్టర్ పర్ఫెక్ట్ టైం లో కూడా డైలాగ్ విషయంలో కె విశ్వనాథ్ తనని ఇలా అయితే ఎలా.. హీరో ఓపెన్ గా డైలాగ్ చెప్పాలి.. సిగ్గుపడకూడదని అన్నారని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు తనతో పనిచేసిన దర్శకులంతా రాజమౌళి తిట్టుకుంటారని సరదాగా చెప్పాడు ప్రభాస్.

ఛత్రపతి సూపర్ హిట్ కాగా బాహుబలి 1, 2 సినిమాలు తీసి వారెవా అనిపించేశాడు రాజమౌళి. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమా లో కూడా రాజమౌళి అల గెస్ట్ అప్పియరెన్స్ తో సర్ ప్రైజ్ చేశారు. మళ్లీ ప్రభాస్ రాజమౌళి కాంబో సినిమా చూడాలని రెబల్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఐతే అది ఇప్పుడప్పుడే సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మహేష్ సినిమా కోసం రాజమౌళి అంతా సిద్ధం చేసుకుంటున్నారు. మహేష్ సినిమాను రాజమౌళి దాదాపు 500 కోట్ల పైన బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారని టాక్. సినిమా కోసం హాలీవుడ్ నుంచి టెక్నిషియన్స్ ని తీసుకొస్తున్నారని తెలుస్తుంది.

Tags:    

Similar News