సలార్ 2.. ఈ ప్రశ్నలకు బదులేది?

ఇప్పటికే చాలా సినిమాలతో కనువిందు చేసిన ఈ స్టార్ హీరో.. ఇప్పుడు కూడా పలు మూవీలను చేస్తున్నాడు. అందులో ‘సలార్ 2’ ఒకటి.

Update: 2024-10-24 06:11 GMT

ఒకప్పుడు ప్రాంతీయ భాషల్లో మాత్రమే ఎక్కువగా సినిమాలు వచ్చేవి. కానీ, ఇప్పుడు మాత్రం స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నారు. అందులో అందరి కంటే ఎక్కువగా టాలీవుడ్ నుంచి ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే చాలా సినిమాలతో కనువిందు చేసిన ఈ స్టార్ హీరో.. ఇప్పుడు కూడా పలు మూవీలను చేస్తున్నాడు. అందులో ‘సలార్ 2’ ఒకటి.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ సినిమానే ‘సలార్’. ఇది రెండు భాగాలుగా వస్తున్నట్లు చిత్ర యూనిట్ యూనిట్ ముందే అనౌన్స్ చేసింది. అందుకు తగ్గట్లుగానే తగ ఏడాది మొదటి భాగాన్ని ‘సలార్: సీజ్‌ఫైర్’ పేరుతో తీసుకు వచ్చారు. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం మంచి వసూళ్లనే అందుకుని సత్తా చాటుకుంది.

‘సలార్: సీజ్‌ఫైర్’ సూపర్ హిట్ అవడంతో దీనికి సీక్వెల్‌గా ‘సలార్: శౌర్వాంగ పర్వం’ మూవీని తీస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కానీ, ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రం షూట్‌పై బుధవారమే నిర్మాణ సంస్థ ఓ ప్రకటన చేసింది. ఇందులో ‘సలార్ 2’ మూవీ రెగ్యూలర్ షూటింగ్‌ తాజాగా ప్రారంభం అయిందని, 20 రోజులు చిత్రీకరణ జరుగుతుందని వెల్లడించింది.

రెబెల్ స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘సలార్: శౌర్యాంగ పర్వం’ మూవీ షూటింగ్‌పై నిర్మాణ సంస్థ అనౌన్స్‌మెంట్ చేసినప్పటికీ.. దీనిపై చాలా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం ప్రభాస్ వేరే చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. దీనికితోడు ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు.

ఇలా ప్రభాస్, ప్రశాంత్ నీల్ తమ తమ పనులతో బిజీగా ఉన్న నేపథ్యంలో అసలు ‘సలార్ 2’ షూటింగ్ ప్రారంభం అయిందని ఎందుకు ప్రకటన చేశారు అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారింది. ఒకవేళ ఈ సినిమా ఆగిపోయిందని అందరూ అనుకుంటారు అన్న కారణంతోనే ఇలా చెప్పారా? లేక అటెక్షన్ పెంచడానికి ప్రకటన చేశారా? అన్నది సందేహంగా మారింది. మొత్తానికి సలార్ నిర్మాతలు చేసిన పని హాట్ టాపిక్ అవుతోంది.

‘సలార్ 2’ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా చేస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు. ఇందులో శ్రీయా రెడ్డి, బాబీ సింహా, ఈశ్వరీ రావు, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

Tags:    

Similar News