హీరోయిన్‌తో స్టార్ హీరో నిశ్చితార్థం గ‌మ్మ‌త్తు!

ఓవైపు భార్య‌తో విడాకుల బ్యాటిల్ న‌డిపిస్తున్నాడు జ‌యం ర‌వి. త‌న అనుమ‌తి లేకుండా విడాకులు ఇవ్వ‌లేడ‌ని అత‌డి భార్య ఆర్తి అంటున్నారు

Update: 2024-10-04 06:01 GMT

ఓవైపు భార్య‌తో విడాకుల బ్యాటిల్ న‌డిపిస్తున్నాడు జ‌యం ర‌వి. త‌న అనుమ‌తి లేకుండా విడాకులు ఇవ్వ‌లేడ‌ని అత‌డి భార్య ఆర్తి అంటున్నారు. ఈ విడాకుల వివాదంలో ప్ర‌ముఖ గాయ‌ని కం వైద్యురాలి పాత్ర గురించి చాలా చ‌ర్చ సాగుతోంది. అయితే ఇలాంటి స‌మ‌యంలో ఊహించ‌ని ట్విస్టు. జ‌యం ర‌వి ప్ర‌ముఖ హీరోయిన్ ప్రియాంక మోహ‌న‌న్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటో ఒక‌టి అంత‌ర్జ‌లంలో వైర‌ల్ గా మారింది.

అయితే ఇందులో నిజం ఎంత‌? అన్న‌ది ఆరా తీస్తే.... ప్రస్తుతం తన భార్య ఆర్తి నుండి విడాకులు తీసుకునే ప్రక్రియలో ఉన్న జ‌యం ర‌వి త‌న త‌దుప‌రి చిత్రం `బ్రదర్` విడుదల ప్ర‌చారానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంలో జయం రవి, ప్రియాంక మోహన్ జంట‌గా నటిస్తున్నారు. ఈ పెళ్లి ఫోటో ఆ సినిమాలోనిదేన‌ని తెలిసింది. భార్య ఆర్తితో ఫ్రాంక్ ఫోటో అని దీనిని అనుకోవాలి. ఆ ఫోటోలో జయం రవి, ప్రియాంక నిశ్చితార్థం పూర్తి చేసుకుని పెళ్లి కోసం సిద్ధంగా ఉన్న‌ జంటలా కనిపించారు. ఈ ఫోటో X లో విస్తృతంగా షేర్ అయింది. ఇది అభిమానులను గందరగోళానికి గురిచేసింది.

`బ్రదర్` రొమాంటిక్ కామెడీ మూవీ. దీనికి ఎం రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 2022లో ప్రకటించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అభిమానులు సినిమా చూడటానికి ఆసక్తిగా ఉండగా జయం రవి వ్యక్తిగత జీవితం ఇప్పుడు కొద్ది రోజులుగా చర్చనీయాంశమైంది. గత నెలలో జయం రవి తన భార్య ఆర్తి నుండి విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత అభిమానులకు షాక్ ఇచ్చారు. ఈ నిర్ణయం వెనుక గల కారణాలను ఆయన వెల్లడించలేదు. ఆర్తి తన సమ్మతి లేకుండా విడాకులు ప్రకటించారని సోషల్ మీడియాలో తెలిపారు. విడిపోయినట్లు వార్తలు, సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నానని ఆమె తెలిపింది.

విడిపోతున్న‌ట్టు జయం తనకు తెలియజేయలేదని ఆమె వెల్లడించారు.

జ‌యం ర‌వి- ఆర్తి జంట 2009 లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బ్రేక‌ప్ ప్రకటన తర్వాత గాయని -ఆధ్యాత్మిక వైద్యురాలు కెనిషా ఫ్రాన్సిస్‌తో జ‌యం ర‌వి స్నేహంగా ఉన్నాడ‌ని ప్ర‌చారం సాగింది. ఈ స్నేహ‌మే భార్య‌తో విడాకుల‌కు కార‌ణ‌మ‌ని పుకార్లు షికార్ చేయ‌గా, ఈ పుకార్లను ఫ్రాన్సిస్ ఖండించారు. త‌ప్పుడు వ‌దంతులు సృష్టిస్తే వారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని కెనీషా ఫ్రాన్సిస్ హెచ్చ‌రించారు.

Tags:    

Similar News