రాజ్ తరుణ్- లావణ్య వ్యవహారం.. రూ.70 లక్షలు ఇచ్చారట!

ఇప్పుడు రీసెంట్ గా నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు.

Update: 2024-09-07 04:54 GMT

నటుడు రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే పదేళ్లపాటు తనతో సహజీవనం చేసి, మరో హీరోయిన్ మోజులో పడి తనను దూరం పెడుతున్నారని లావణ్య ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అబార్షన్ కూడా చేయించారని ఆరోపించింది. ఇప్పుడు రీసెంట్ గా నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఆయనను నిందితుడిగా చేర్చారు.

దీంతో లావణ్య మరోసారి మీడియా ముందుకు వచ్చింది. రాజ్ తరుణ్ పై ఛార్జ్ షీట్ దాఖలు అవ్వడం శుభపరిణామమని పేర్కొంది. న్యాయం కోసం పోరాడుతున్నానని తెలిపింది. తనకు చాలా అన్యాయం జరిగిందని చెప్పింది. తనపై అనేక నిందలు వేశారని వ్యాఖ్యానించింది. చివరికి న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసింది. రాజ్ తరుణ్ తన వద్ద నుంచి వెళ్లిపోయాక మానసికంగా ఎంతో వేదనకు గురయ్యానని తెలిపింది.

శేఖర్ భాష అనే వ్యక్తిని అస్త్రంగా ఉపయోగించి తనపై ఎన్నో నిందలు వేశారని లావణ్య ఆరోపించింది. తమ సమస్యలోకి శేఖర్ కావాలనే ఇన్వాల్వ్ అయ్యారని తెలిపింది. ఆయనతో పాటు మరికొందరు తమ విషయాన్ని యూజ్ చేసుకున్నారని చెప్పింది. అలా క్రేజ్ సంపాదించుకుని.. బిగ్ బాస్ లోకి వెళ్లే ఛాన్స్ అందుకున్నారని ఆరోపించింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నారని లావణ్య విమర్శించింది.

అదే సమయంలో రాజ్ తరుణ్ కు తన తల్లిదండ్రులు రూ.70 లక్షలు ఇచ్చారని ఆరోపణలు చేసింది లావణ్య. చెప్పాలంటే.. కొంత టైమ్ లో ఆయనను తాను పోషించానని తెలిపింది. తన వివాహం కోసం ఇప్పటికే కొనుగోలు చేసిన రెండు స్థలాలను పేరెంట్స్ అమ్మేశారని చెప్పింది. ఆ డబ్బులనే రాజ్ తరుణ్ కు ఇచ్చారని చెప్పింది. ల్యాండ్ సైట్స్ అమ్మిన వివరాలు, రాజ్ తరుణ్ కు ఇచ్చిన చెక్ లు మొత్తం తన వద్ద ఉన్నాయని తెలిపింది.

కొన్నాళ్ల పాటు రాజ్ తరుణ్ సినిమాలు చేయలేదని, అప్పుడు అద్దె ఇంట్లో నివసించే వాళ్లమని లావణ్య తెలిపింది. హౌస్ రెంట్ రూ.60 వేలు ఉండేదని చెప్పింది. అప్పుడు అద్దె చెల్లించేందుకు తన పేరెంట్సే డబ్బులు ఇచ్చేవారని పేర్కొంది. అలా మొత్తం కలిపి రూ.70 లక్షలు ఇచ్చారని ఆరోపించింది. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు.. నెట్టింట ఫుల్ వైరల్ గా మారాయి.

Tags:    

Similar News