ఆ హీరోయిన్ కు రాజ్ తరుణ్ క్షమాపణ

రాజ్ తరుణ్ మీద అతని మాజీ ప్రియురాలు లావణ్య సంచలన ఆరోపణలు చేస్తూ పోలీసు కేసు పెట్టింది.

Update: 2024-09-13 04:20 GMT

హీరో రాజ్ తరుణ్ ఇష్యూ గత రెండు నెలలుగా మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రాజ్ తరుణ్ మీద అతని మాజీ ప్రియురాలు లావణ్య సంచలన ఆరోపణలు చేస్తూ పోలీసు కేసు పెట్టింది. రాజ్ తరుణ్ తనతో 11 ఏళ్ళు సహజీవనం చేసి మోసం చేశాడంటూ ఆరోపణలు చేసింది. వీటిపై ఇప్పటికే పోలీసులు కేసు ఫైల్ చేసి విచారణ చేపట్టారు. లావణ్య పెట్టిన కేసులో నిజాలు ఉన్నాయని ఛార్జ్ షీట్ ఫైనల్ చేయడానికి రెడీ అవుతున్నారంట. మరో వైపు రాజ్ తరుణ్ హైకోర్టు ద్వారా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.

వైపు ఈ ఇష్యూ నడుస్తూ ఉండగానే రాజ్ తరుణ్ చాలా గ్యాప్ తర్వాత తన సినిమాలని బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ చేస్తున్నారు. పురుషోత్తముడు, తిరగబడర సామి సినిమాలు ఇప్పటికే రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ సినిమాలపై రాజ్ తరుణ్ చుట్టూ ఉన్న వివాదం కూడా కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

ఇదిలా ఉంటే ఆరంభంలో మీడియాలో కొంత హడావిడి చేసిన లావణ్య సైలెంట్ అయిపోయి సడెన్ గా ఒక వీడియో రిలీజ్ చేసింది. ముంబైలో మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ కలిసి ఉంటున్నాడని ఆరోపణలు చేస్తూ వారిద్దరూ ఒకే చోట ఉన్న సమయంలో వెళ్లి గొడవ చేసింది. లావణ్య మాల్వీ మల్హోత్రాని దూషించింది. ఈ వీడియోలో జరిగిన ఘటనపై రాజ్ తరుణ్ ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యారు. మాల్వీ మల్హోత్రాకి క్షమాపణలు చెప్పారు.

ముంబయిలో జరిగిన ఘటనని గుర్తు చేసుకుంటే చాలా బాధగా ఉంది. అవమానంగా అనిపించింది. మీ ఇంటి వద్ద ఇలాంటి ఘటన జరిగినందుకు క్షమించమని కోరుతున్నాను. అయిన కూడా నీతో, నీ స్నేహితులతో కలిసి చేసుకున్న వినాయక చవితి పండగని ఆస్వాదించాను.. గణేశుడి ఆశీస్సులు మనందరికీ ఉంటాయని మాల్వీ మాల్హోత్రాను ట్యాగ్ చేస్తూ రాజ్ తరుణ్ సారీ చెప్పాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోపై వివరణ ఇవ్వడానికి అన్నట్లు రాజ్ తరుణ్ ఈ పోస్ట్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ నటించిన కొత్త సినిమా భలే ఉన్నాడే నేడు ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సినిమాపై రాజ్ తరుణ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కంటెంట్ కూడా కాస్తా కొత్తగా ఉండటంతో ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాడు. చివరగా వచ్చిన రెండు సినిమాలతో ఆడియన్స్ ని మెప్పించలేకపోయిన రాజ్ తరుణ్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News