అల్లు అర్జున్‌ అప్పుడే చెప్పాడు : రకుల్‌

రకుల్‌ మాట్లాడుతూ.... అల్లు అర్జున్‌ మంచి నటుడు. నేను ఆయనతో సరైనోడు సినిమా చేస్తున్న సమయంలో ఒక మాట అన్నాడు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లాలి అనేది తన డ్రీమ్‌గా చెప్పుకొచ్చాడు.

Update: 2024-09-12 20:30 GMT

టాలీవుడ్‌ లో పలు సూపర్‌ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడంతో కనిపించకుండా పోయిన ఈ అమ్మడు అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా, ఏదైనా ఇంటర్వ్యూ ద్వారా నెట్టింట చర్చనీయాంశం అవ్వడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈమె చేతిలో చిన్నా చితకా ప్రాజెక్ట్‌ లు మినహా పెద్ద సినిమాలు ఏమీ లేవు. అయినా ఈమెకు నెట్టింట ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.

ఇటీవల ఈమె ఒక చిట్ చాట్‌ లో టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు, తాను కలిసి నటించిన అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ ల గురించి మాట్లాడింది. ఆ సమయంలో వారు ముగ్గురి పై రకుల్‌ చేసిన కామెంట్స్ వారి వారి ఫ్యాన్స్ కి కిక్‌ ఇస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్‌ గురించి మాట్లాడమంటూ ఇంటర్వ్యూ లో అడిగిన సమయంలో రకుల్‌ మాట్లాడుతూ.... అల్లు అర్జున్‌ మంచి నటుడు. నేను ఆయనతో సరైనోడు సినిమా చేస్తున్న సమయంలో ఒక మాట అన్నాడు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లాలి అనేది తన డ్రీమ్‌గా చెప్పుకొచ్చాడు. పుష్ప సినిమా తో నిజంగానే సినిమా ను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి అల్లు అర్జున్ తీసుకు వెళ్లాడు.

అదే సమయంలో ఎన్టీఆర్‌ గురించి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్పందిస్తూ... పుట్టుకతోనే నటుడు, ఒక గొప్ప వ్యక్తి. బ్లడ్ లోనే అతడికి నటన ఉంది అంటూ రకుల్‌ ఆకాశానికి ఎత్తేసింది. ఇక రామ్‌ చరణ్ గొప్ప డాన్సర్ అంటూ చెప్పుకొచ్చిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ ముగ్గురితో నటించడం గౌరవంగా చెప్పుకొచ్చింది. భవిష్యత్తులో ఈ అమ్మడు మళ్లీ తెలుగు సినిమాల్లో హీరోయిన్‌ గా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇలా టాలీవుడ్‌ స్టార్స్ గురించి పాజిటివ్‌ కామెంట్స్‌ చేస్తుంది అంటూ ఆమెను ట్రోల్‌ చేస్తున్న వారు ఉన్నారు. అసలు విషయం ఏదైనా అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, చరణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం రకుల్‌ కామెంట్స్ ను వైరల్‌ చేస్తున్నారు.

రకుల్‌ తెలుగు లో కెరటం సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత తమిళ సినిమాలకు పరిమితం అయ్యి, కొంత గ్యాప్ తర్వాత 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' సినిమాతో మొదటి హిట్ ను తెలుగు లో దక్కించుకుంది. అక్కడ నుంచి రకుల్‌ కెరీర్‌ లో వెనక్కి చూసుకోకుండా ముందుకు సాగి పోయింది. రామ్‌ చరణ్‌ తో బ్రూస్లీ సినిమాతో పాటు ఎన్టీఆర్‌ తో నాన్నకు ప్రేమతో, అల్లు అర్జున్ తో సరైనోడు, మహేష్ బాబుతో స్పైడర్‌ ఇంకా పలువురు తెలుగు, తమిళ స్టార్‌ లతో రకుల్‌ ప్రీత్‌ సింగ్ సినిమాలు చేసి భారీ విజయాలను సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు మాత్రం ఆఫర్లు లేక దిక్కులు చూస్తోంది. మళ్లీ ఫుల్ స్వింగ్ తో రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అనే నమ్మకం ను ఆమె సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News