సెల్పీలు..కిస్సుల‌తో చిన్న బాస్ డ‌బుల్ కిక్!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇమేజ్ ని `ఆర్ ఆర్ ఆర్` ఏ స్థాయికి తీసుకెళ్లింద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు

Update: 2024-08-16 13:50 GMT

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇమేజ్ ని `ఆర్ ఆర్ ఆర్` ఏ స్థాయికి తీసుకెళ్లింద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. `ఆర్ ఆర్ ఆర్` హిట్ తో గ్లోబ‌ల్ స్థాయిలో వెలిగిపోతున్నాడు. చ‌ర‌ణ్ ఇప్పుడేదేశం వెళ్లినా అక్క‌డ సంచ‌ల నంగా మారిపోతున్నాడు. జపాన్ వెళ్లినా..చైనా వెళ్లినా? న్యూజిలాండ్ వెళ్లినా...అమెరికా వెళ్లినా? వ‌ర‌ల్డ్ అంతా చ‌ర‌ణ్ అభిమానుల హంగామా మూములుగా ఉండ‌టం లేదు. ఇక ఇండియ‌న్ ఫిల్మ్ పెస్టివ‌ల్స్ లో భాగంగా మెల్బోర్న్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే.

తొలి రోజు మెల్బోర్న్ చేరుకోగానే నగరంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఎయిర్ పోర్టు వద్దకు భారీగా అభిమానులు తరలివచ్చారు. తాజాగా ఓ వీడియో ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. అభిమానుల‌తో చ‌ర‌ణ్ స్వ‌యంగా తానే సెల్పీలు దిగాడు. అక్క‌డ అభిమానుల ఉత్సాహం చూసి పుల‌కించిపోయాడు. అభిమానుల‌కు ప్లైయింగ్ కిస్సులు ఇస్తూ అంద‌ర్నీ అల‌రించాడు. ప్ర‌స్తుతం ఆ వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

మెల్బోర్న్ లో ఆగస్టు 15 నుంచి 25 వరకు జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం) చలనచిత్రోత్సవానికి రామ్ చరణ్ గౌరవ అతిథిగా హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఐఎఫ్ఎఫ్ఎం 15వ ఎడిషన్ వేడుకలకు హాజరు కావాలంటూ ఇటీవల ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు రామ్ చరణ్ కు ఆహ్వానం పంపింది. దీంతో గౌర‌వార్దం చ‌ర‌ణ్ కూడా హాజ‌ర‌య్యారు. ఈ చలనచిత్రోత్సవంలో రామ్ చరణ్ కు నిర్వాహకులు 'ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చరల్ అంబాసిడర్' అనే బిరుదును కూడా ప్రదానం చేయనున్నారు.

ఇక చ‌ర‌ణ్ లైన‌ప్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇటీవ‌లే `గేమ్ ఛేంజ‌ర్` షూటింగ్ ముగించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. చ‌ర‌ణ్ డ‌బ్బింగ్ పూర్తి చేయాల్సి ఉంది. అలాగే బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం షూటింగ్ కూడా హాజ‌రు కావాల్సి ఉంది.

Tags:    

Similar News