విశ్వంభర.. ఓ లీక్ ఇచ్చిన తెలుగమ్మాయి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ విశ్వంభర.

Update: 2024-08-17 10:57 GMT

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ విశ్వంభర. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ మూవీ ఉండబోతోందని తెలుస్తోంది. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకొని రావాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే మూవీ వర్క్ జరుగుతోంది.

ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా త్రిష, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. వారి పాత్రలు మూవీలో చాలా కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. జగదేకవీరుడు అతిలోక సుందరి తరహాలో ఈ మూవీ ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తెలుగమ్మాయి రమ్య పసుపులేటి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ బ్యూటీ నటించిన మారుతీనగరం సుబ్రహ్మణ్యం మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో రమ్య పసుపులేటి పాల్గొంది.

ఈ సందర్భంగా విశ్వంభర మూవీ గురించి ఇంటరెస్టింగ్ విషయాన్ని లీక్ చేసింది. విశ్వంభర సినిమాలో తాను మెగాస్టార్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్నానని క్లారిటీ ఇచ్చింది. నిజానికి సినిమాలలో హీరోయిన్స్ పాత్రలు తప్ప చెల్లెలు రోల్స్ చేయకూడదని అనుకున్నాను. కానీ మెగాస్టార్ చిరంజీవి సినిమా అనేసరికి ఇక ఛాన్స్ వదులుకోవాలని అనుకోలేదు. అందుకే ఒప్పుకున్నాను.

కథలో నా పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. మరికొందరు హీరోయిన్స్ కూడా ఈ సినిమాలో చిరంజీవి సిస్టర్స్ పాత్రలలో నటిస్తున్నారు అని రమ్య పసుపులేటి క్లారిటీ ఇచ్చింది. దీంతో మూవీలో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉండబోతోందనే విషయం రివీల్ అయ్యింది. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ కి సిస్టర్ సెంటిమెంట్ తోడైతే కచ్చితంగా కొత్తగా ఉంటుందనే మాట ఇప్పుడు వినిపిస్తోంది.

ఏది ఏమైనా మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్ లో కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేస్తోన్న సినిమా కావడంతో విశ్వంభరపైన భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే చిరంజీవికి పాన్ ఇండియా లెవల్ లో మార్కెట్ క్రియేట్ అవుతుంది. బింబిసారతో మొదటి ప్రయత్నంలోనే దర్శకుడిగా బ్లాక్ బస్టర్ అందుకున్న వశిష్ట మల్లిడి ద్వితీయ విఘ్నాన్ని అధికమించి మెగాస్టార్ కి బ్లాక్ బస్టర్ ఇస్తాడా అనేది చూడాలి.

Tags:    

Similar News