జానీ మాస్టర్ వ్యవహారం.. పుష్ప ప్రొడ్యూసర్ క్లారిటీ!

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే.

Update: 2024-09-23 09:24 GMT

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ అతడి దగ్గర వర్క్ చేసిన అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న అతడిని అరెస్టు చేశారు. గోవాలో ఉన్న జానీ మాస్టర్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే తెలుగు రాష్ట్రాల్లో జానీ మాస్టర్ వ్యవహారం పెద్ద చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. అదే సమయంలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప -2 మూవీ సెట్స్ లో బాధితురాలికి, జానీ మాస్టర్ కు గొడవ అయిందని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. మూవీ నిర్మాత వచ్చి సాల్వ్ చేశారని పుకార్లు వచ్చాయి. అల్లు అర్జున్, సుకుమార్ పేర్లు కూడా వినిపించాయి.

ఇప్పుడు ఈ విషయంపై పుష్ప -2 మూవీ ప్రొడ్యూసర్ రవిశంకర్ రెస్పాండ్ అయ్యారు. రీసెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మత్తు వదలరా -2 సినిమా ప్రెస్ మీట్ లో స్పందించారు. ప్రజంట్ హాట్ టాపిక్ గా మారిన జానీ మాస్టర్ వ్యవహారంలో పుష్ప సెట్స్, బన్నీ, సుకుమార్ పేర్లు వినిపిస్తున్నాయి.. దానిపై క్లారిటీ ఇవ్వండని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రవిశంకర్ సమాధానమిచ్చారు.

ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ అబ్జర్వ్ చేస్తే.. అది వాళ్ళ వాళ్ళ పర్సనల్ విషయంగా అర్థమవుతుందని రవిశంకర్ తెలిపారు. పుష్ప -2 మూవీకి గాను అడిషనల్‌ కొరియోగ్రాఫర్‌ గా ఆమె(బాధితురాలు)ను సెలెక్ట్ చేశామని చెప్పారు. ఆమె అన్ని పాటలకు వర్క్ చేసేందుకు ఎంపిక చేశామని తెలిపారు. ఇప్పుడు రెండు పాటల షూటింగ్ పార్ట్ పెండింగ్ ఉందని, వచ్చే నెల 15వ తేదీ కల్లా కంప్లీట్ అవుతుందని వెల్లడించారు. ఇప్పటికే తాము రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్ లో ఆమె పేరు ఉందని తెలిపారు.

అదే సమయంలో సినిమాలో జానీ మాస్టర్ స్పెషల్ సాంగ్ చేయాల్సి ఉందని తెలిపారు రవిశంకర్. మరికొద్ది రోజుల్లో ఆ సాంగ్ షూటింగ్ మొదలవ్వాల్సి ఉందని, ఇంతలోనే ఇలా జరిగిందని చెప్పారు. అయితే కొన్ని యూట్యూబ్ ఛానెల్స్.. తప్పుడు విషయాలు పబ్లిసిటీ చేస్తున్నాయని మండిపడ్డారు. సెన్సేషన్ కోసం అలా చేస్తున్నాయని అన్నారు. మెయిన్ మీడియా స్ట్రీమ్ లో అలాంటి వార్తలు రావడం లేదని చెప్పారు. పుష్ప -2 యూనిట్ కు జానీ మాస్టర్ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అది వారి వ్యక్తిగత గొడవ అని, దానిపై తాను కామెంట్స్ చేయదలుచుకోలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రవిశంకర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Tags:    

Similar News