ఎన్టీఆర్ - నీల్.. ఆ హీరోయిన్ ఏమందంటే..

మరో వైపు కన్నడంలో శివరాజ్ కుమార్ ‘భారతి రంగల్’ మూవీలో కూడా చేస్తోంది. ఇలా చేతినిండా సినిమాలతో రుక్మిణి ఫుల్ బిజీగా ఉంది.

Update: 2024-10-26 05:47 GMT

‘సప్తసాగరాలు దాటి’ సిరీస్ తో ప్రేక్షకులకి చేరువ అయిన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్. ఈ అమ్మడు ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఈ చిత్రంలో నిఖిల్ కి జోడీగా రుక్మిణి నటిస్తోంది. మరో వైపు తమిళంలో శివ కార్తికేయన్ కి జోడీగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో చేస్తోంది. మరో వైపు కన్నడంలో శివరాజ్ కుమార్ ‘భారతి రంగల్’ మూవీలో కూడా చేస్తోంది. ఇలా చేతినిండా సినిమాలతో రుక్మిణి ఫుల్ బిజీగా ఉంది.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2025లో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో ప్రశాంత్ నీల్ ఉన్నారు. ఈ నేపథ్యంలో రుక్మిణి వసంత్ ని ‘డ్రాగన్’ మూవీలో ఎన్టీఆర్ కి జోడీగా కన్ఫర్మ్ చేసినట్లు ప్రచారం తెరపైకి వచ్చింది. ప్రశాంత్ నీల్ స్టోరీ అందించిన ‘బఘీరా’ మూవీలో శ్రీమురళీతో రుక్మిణి జతకట్టింది. ఈ మూవీ దీపావళికి రిలీజ్ అవుతోంది.

ఈ కారణంగానే ‘డ్రాగన్’ సినిమాలో ఆమెని హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. నిజానికి ఆ మూవీ కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఒకవేళ ఛాన్స్ వస్తే మాత్రమే వెంటనే సైన్ చేసేస్తాను. అదొక అందమైన రూమర్ అంటూ రుక్మిణి వసంత్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఆమె ఎన్టీఆర్ తో జతకట్టేందుకు మాత్రం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుందని అర్ధమవుతోంది. ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో చేయబోతున్నారు.

పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి స్టార్ హీరోయిన్ ని తీసుకునే ప్లాన్ లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2’ షూటింగ్ లో ఉన్నారు. ఇది కంప్లీట్ అయ్యాక డ్రాగన్ సినిమా షూటింగ్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది. ప్రశాంత్ నీల్ ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ పైన ఫోకస్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలలలో మాట్లాడుకుంటున్నారు.

Tags:    

Similar News