ప్ర‌భాస్ స్పిరిట్ 'సింగం' కంటే యూనిక్‌గా?

3 సినిమాల కిడ్ అయినా 30 చెరువుల నీళ్లు తాగించ‌గ‌ల ప్ర‌తిభావంతుడిగా పాపుల‌ర‌య్యాడు.

Update: 2024-10-24 02:26 GMT

సందీప్ రెడ్డి వంగా వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో సంచ‌ల‌నంగా మారాడు. అర్జున్ రెడ్డి, క‌బీర్ సింగ్, యానిమ‌ల్ చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాలు అందుకున్న అత‌డు భార‌త‌దేశంలోని ప్రామిస్సింగ్ పాన్ ఇండియన్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డిగా ఎదిగాడు. 3 సినిమాల కిడ్ అయినా 30 చెరువుల నీళ్లు తాగించ‌గ‌ల ప్ర‌తిభావంతుడిగా పాపుల‌ర‌య్యాడు.

యానిమల్ అద్భుత విజయం తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం తన తదుపరి చిత్రం - స్పిరిట్ కోసం సీరియ‌స్ గా పని చేస్తున్నారు. ఈసారి భార‌త‌దేశంలోని బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ స్టార్ ప్రభాస్‌ను డైరెక్ట్ చేయ‌బోతున్నాడు. దీంతో బజ్ పీక్స్ కి చేరుకుంది. ఈ సినిమా ఇంకా ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ఉంది. ప్రాజెక్ట్ గురించి ఎవ‌రికీ పెద్దగా తెలియదు. అయితే తాజాగా మీడియాతో చాటింగ్ సెష‌న్ లో వంగా `స్పిరిట్` ప్లాట్ గురించి ఒక ముఖ్య‌మైన హింట్ ఇచ్చాడు.

తెలుగు సినిమా పొట్టెల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కనిపించిన సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ గురించి ఓపెన్ అయ్యాడు. ఈ సినిమా గురించి తెలియని నిజాన్ని బయటపెట్టాలని దర్శకుడు వంగాను కోర‌గా, అత‌డు చాక్ బోర్డ్ తీసుకుని సుద్దతో `పోలీస్ స్టోరీ` అని రాసాడు. ఈవెంట్ హోస్ట్ దాన్ని బిగ్గరగా చదవడంతో ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు. ఈ ప్రకటన తర్వాత అభిమానులు స్పిరిట్‌లో ప్ర‌భాస్ ని పోలీసు యూనిఫామ్ లో చూస్తామ‌ని అర్థం చేసుకున్నారు. ఈ ఈవెంట్‌కి సంబంధించిన వీడియో X లో వైరల్ అవుతోంది. #స్పిరిట్ కథాంశం పోలీస్ అధికారి చుట్టూ తిరుగుతుంది. సాహసోపేతమైన COP కథలో అద్బుత‌మైన డ్రామాను ఎలివేట్ చేస్తున్నామ‌ని దర్శకుడు సందీప్ వంగా పొట్టేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వెల్లడించారు.

స్పిరిట్‌ను రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్టు గతంలో గలాట్టా ప్లస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ వంగా వెల్లడించారు. ఈ చిత్రం రిలీజైతే మొదటి రోజు 150 కోట్ల రూపాయలను వసూలు చేస్తుందని దర్శకుడు ధీమాను క‌న‌బ‌రిచాడు. ప్రభాస్ తో నా కాంబినేషన్ అంటే.. శాటిలైట్, డిజిటల్ హక్కులతోనే మేం మా బడ్జెట్‌ను తిరిగి పొందగలము. టీజర్, ట్రైలర్, పాటల ప్రీ-రిలీజ్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ఏమి చేసినా అన్నీ సరిగ్గా అమ‌లైతే ప్రారంభ రోజు రూ. 150 కోట్లు వ‌సూలు చేస్తుంది! అని వంగా లెక్క‌లు చెప్పుకొచ్చాడు. అయితే కాప్ స్టోరిలు మ‌న‌కు కొత్త కాదు. కాప్ డ్రామాల‌తో సింగం ఫ్రాంఛైజీ పెద్ద స‌క్సెసైంది. దానికి భిన్నంగా సందీప్ వంగా తెర‌పై ఏం చూపిస్తాడ‌న్న‌ది విజ‌యాన్ని అందిస్తుంది.

అత‌డు ఇప్ప‌టికి కేవలం మూడు చిత్రాలకు మాత్ర‌మే దర్శకత్వం వహించాడు - అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ , యానిమల్. ఈ మూడు సినిమాలు కమర్షియల్‌గా మంచి విజయం సాధించాయి. T-సిరీస్ సోషల్ మీడియాలో ఈ చిత్రానికి సంబంధించిన‌ మొదటి పోస్టర్‌ను షేర్ చేసింది. 2021లో స్పిరిట్ ని ప్రకటించారు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో 25వ చిత్రంగా తెర‌కెక్క‌నుంది. దీనిని భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులను సందీప్ వంగ ఇంకా ప్రకటించలేదు.

Tags:    

Similar News