ఆయ‌న ప‌లుక‌బ‌డితో గాడిద‌ను పెటాకి అప్ప‌గించాలి!

మ‌నిషి కి బధులు ఓ గాడిద కంటెస్టెంట్ అయిందంటూ నెట్టింట చ‌ర్చ మొద‌లైంది.

Update: 2024-10-10 10:30 GMT

బాలీవుడ్ బిగ్ బాస్ సీజ‌న్ 18 ఇటీవ‌ల స‌ల్మాన్ ఖాన్ హోస్ట్ గా గ్రాండ్ గా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. 19 మంది కంటెంస్టెంట్ల‌తో ఎంతో గ్రాండ్ గా లాంచ్ అయింది. కంటెస్టెట్ గా టీవీ న‌టులు, రాజ‌కీయ నాయ‌కులు, సోష‌ల్ మీడియా ఇన్ ప్లూయెన్స‌ర్లు అంతా ఉన్నారు. అయితే 19వ కంటెస్ట్ గా ఓ గాడిద‌ని హౌస్ లో కి పంపించారు. దీంతో ప్రేక్ష‌కుల‌కు థ్రిల్లింగ్ అనిపించింది. మ‌నిషి కి బధులు ఓ గాడిద కంటెస్టెంట్ అయిందంటూ నెట్టింట చ‌ర్చ మొద‌లైంది.

ఆ గాడిద పేరు `గద్ రాజ్`. కంటెస్టెంట్‌గా గాడిదను తీసుకువచ్చి బిగ్ బాస్ టీమ్ వినూత్న ప్రయత్నం చేసింది. అయితే, దీనిపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కంటెస్టెంట్ గా గాడిద ఏంట‌ని నెగిటివ్ కామెంట్లు ప‌డుతున్నాయి. ఈ విషయం వైరల్ అవ్వ‌డంతో తాజాగా జంతు సంక్షేమ సంస్థ పెటా కూడా దీనిపై దృష్టి సారించింది. పెటా ఇండియాకు చెందిన న్యాయవాది శౌర్య అగర్వాల్ సల్మాన్ ఖాన్‌కు లేఖ రాశారు.

హౌస్ లో గాడిద‌ను ఉంచ‌డంపై మనస్తాపానికి గురైన ప్రజా ప్రతినిధులు తమ ఫిర్యాదులతో మమ్మల్ని ముంచెత్తుతున్నారు. వారి ఆందోళనలను తిరస్కరించడానికి వీల్లేదు. కచ్చితంగా వాటిపై దృష్టి సారించాల్సిన బాధ్యత మాపై ఉంది` అని అని సల్మాన్ ఖాన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. స్టార్ అయిన స‌ల్మాన్ ఖాన్ త‌న ప‌లుక‌బ‌డి ఉప‌యోగించి పెటా ఇండియాకు గాడిద‌ను అప్ప‌గించేలా చ‌ర్య‌లు తీసుకోవాలి.

ఇత‌ర గాడిద‌ల‌తో క్షేమంగా ఉండే అభ‌యార‌ణ్యంలోకి తిరిగి నివ‌సించేలా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాం` అన్నారు. కంటెస్టెంట్లలో ఒకరైన అడ్వకేట్ సదావర్తే గాడిదనే ఆ హౌజ్‌లోకి తీసుకొచ్చారని ఆ లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News