నాగొయ్యి నేనే తీసుకున్నా! శ్రీనువైట్ల

ఎంతో మంది స్టార్ హీరోల‌తో ప‌నిచేసిన వైట్ల ఇప్పుడు అవ‌కాశం కోసం ఎదురు చూడాల్సిన ప‌రిస్థితి.

Update: 2024-10-02 08:29 GMT

ఒక‌ప్ప‌టి శ్రీనువైట్ల స‌క్సెస్ ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆనందం, సొంతం, వెంకీ, అంద‌రివాడు,ఢీ, దుబాయ్ శీను, రెడీ, కింగ్, దూకుడు, బాద్ షా ఇలా ఎన్నో విజ‌యాలు అత‌డి సొంతం. కానీ త‌ర్వాత ట్రెండ్ని ప‌ట్టుకుని సినిమాలు చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. కాలంతో పాటు ఆయ‌న క‌థ‌లు అప్ డేట్ అవ్వ‌క‌పో వ‌డంతో వైఫ‌ల్యాలు త‌ప్ప‌లేదు. అయినా లైఫ్ సెకెండ్ ఛాన్స్ ఇస్తుందంటారు.అలా మ‌రో రెండు.. మూడు అవ‌కాశాలు అగ్ర హీరోల‌తో వ‌చ్చాయి. కానీ వాటిని నిల‌బెట్టుకోవ‌డంలో వైఫ‌ల్యం అయ్యారు.

ఎంతో మంది స్టార్ హీరోల‌తో ప‌నిచేసిన వైట్ల ఇప్పుడు అవ‌కాశం కోసం ఎదురు చూడాల్సిన ప‌రిస్థితి. ఆయ‌న ఐదేళ్ల‌గా ఖాళీగానే ఉంటున్నారు. ఆయన తాజా చిత్రం `విశ్వం` త్వ‌ర‌లో రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా శ్రీనువైట్ల సినిమా ముచ్చ‌ట్లతో పాటు కొన్ని వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి పంచుకున్నారు. అవేంటో ఆయ‌న మాట‌ల్లోనే.. `గోపీచంద్ కి మూడు స్టోరీ లైన్లు చెబితే ఈ కథ నచ్చింది. గోపీచంద్ మార్క్ యాక్షన్ తో పాటు, నా మార్క్ కామెడీ టచ్ ఉంటుంది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది.

నేను ఇల్లు మారినప్పుడు నాకు వాస్తుపై నమ్మకం ఎక్కువ అన్నారు. ఫ్లాపులు వచ్చినప్పుడు, రియల్ ఎస్టేట్ పై దృష్టి పెట్టి సినిమాలు పట్టించుకోవడం లేదన్నారు. కానీ నేను వాస్తును గురించి పెద్దగా పట్టించుకోను . రియల్ ఎస్టేట్ పిచ్చి లేదు. అందరూ చెప్పుకుంటున్నట్టు నా దగ్గర వేలకోట్లు లేవు. నేను చేసిన పొరపాటు ఏదైనా ఉందంటే `ఆగడు` సినిమా చేయ‌డం. ముందుగా అనుకున్న కథ వేరు.

కానీ ఆ తరువాత ఆ స్థాయి కథ ఆ నిర్మాతలకు మరింత భారమవుతుందని భావించి, వేరే కథను అనుకున్నాం. ఈ సినిమా కోసం కూడా అదే స్థాయిలో కష్టపడ్డాము. కానీ 'దూకుడు' హిట్ తరువాత పెరిగిన అంచనాలను ఆగ‌డు క‌థ అందుకోలేదు. నాకు నేనుగా తీసుకున్న గొయ్యి అది` అని అన్నారు.

Tags:    

Similar News