దేవరని వర ఎందుకు చంపాడు… ఎన్టీఆర్ సమాధానం ఇదే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీకి థియేటర్స్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

Update: 2024-10-06 03:58 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీకి థియేటర్స్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. రెండో వారంలో కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. సెకండ్ వీకెండ్ కూడా సినిమాకి మంచి వసూళ్లు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే దసరా హాలిడేస్ కలిసి రావడంతో మరల థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. మూవీ టీం కూడా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే ‘దేవర’ మూవీ సక్సెస్ తర్వాత మరల ఎన్టీఆర్, కొరటాల శివ ప్రత్యేకంగా సుమకి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఇందులో ‘దేవర’ మూవీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి చాలా విషయాలు ఎన్టీఆర్, కొరటాల శివ షేర్ చేసుకున్నారు. అలాగే పార్ట్ 2 గురించి ఇంటరెస్టింగ్ విషయాలని పంచుకున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ సుమ ‘దేవర 1’ చూసిన తర్వాత ఆడియన్స్ కి వచ్చిన డౌట్స్ ని ఎన్టీఆర్, కొరటాల శివని అడిగారు. దానికి ఎన్టీఆర్ వెరైటీగా సమాదాలు చెప్పడం విశేషం. అసలు దేవరని వర ఎందుకు చంపాడు? అని సుమ ప్రశ్నించింది. చెప్పేస్తారు మరి… ఆ సీక్రెట్ చెప్పేస్తే ‘దేవర 2’ కి ఎవరు టికెట్లు కొంటారు? అంటూ సరదాగా కౌంటర్ వేసాడు.

సముద్రంలో అస్థిపంజరాలు ఎవరివి అంటూ సుమ మరో ప్రశ్న వేసింది. ఆ ఆస్థిపంజరాలు అన్ని ఈదుకుంటూ సముద్రంలోకి వెళ్ళిపోయాయి అంటూ ఎన్టీఆర్ ఫన్నీగా సమాధానం చెప్పారు. అయితే కొరటాల శివ వాటిపై ఓ చిన్న క్లూ ఇచ్చారు. ఆ ఆస్థి పంజరాల్లో ఒకటి మాత్రం చాలా ముఖ్యమైన క్యారెక్టర్ ది. ఆ క్యారెక్టర్ ఎవరనేది తెలియాలంటే ‘దేవర 2’ చూడాలి అంటూ సమాధానం ఇచ్చారు. వారి సంభాషణ బట్టి దేవర మూవీ ఆరంభంలో సముద్రం లోపల చూపించిన ఆస్థిపంజరాల బ్యాక్ డ్రాప్ లో అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ ఉంటుందని స్పష్టం అవుతోంది.

అలాగే ‘దేవర పార్ట్ 1’ లో జాన్వీ కపూర్ క్యారెక్టర్ కొద్దిసేపే ఉంటుంది. కాని ‘దేవర పార్ట్ 2’ లో మాత్రం వర, తంగం మధ్యలో మంచి ఇంటరెస్టింగ్ లవ్ స్టోరీ ఉంటుంది. అలాగే ఆమె క్యారెక్టర్ కి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది. ‘దేవర పార్ట్ 2’ లో తంగం పాత్ర చాలా కీలకంగా ఉంటుందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. దీంతో జాన్వీ కపూర్ గ్లామర్ ని ‘దేవర’ లో కొంత వరకు మాత్రమే చూశామని డిజపాయింట్ అయినవారికి కొంత జోష్ వచ్చింది.

‘దేవర పార్ట్ 2’ లో మెయిన్ రోల్ కి సంబందించిన ఒక ఎమోషనల్ సీన్ ఉంటుందని ఎన్టీఆర్ చెప్పారు. అది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని అన్నారు. చాలా ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ సెకండ్ పార్ట్ లో ఎంగేజింగ్ గా ఉండబోతున్నాయని ఎన్టీఆర్, కొరటాల శివ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.

Tags:    

Similar News