నాన్న త‌రుపున సీఎం ని క‌లిసి చెక్ అందించిన తేజ‌స్వీని!

ఈ నేప‌థ్యంలో తాజాగా బాల‌కృష్ణ తరుపున 50 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్ ను ఆయ‌న చిన్న‌ కుమార్తె తేజ‌స్వీని నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సీఏం రేవంత్ ని క‌లిసి అందించారు

Update: 2024-09-13 11:11 GMT

ఇటీవ‌ల తెలుగు రాష్ట్రాల్ని వర‌ద‌లు ముంచెత్తిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భారీ ఎత్తున విరాళాలు ప్ర‌క‌టించ‌డం..కొంద‌రు వాటిని స్వ‌యంగా ముఖ్య‌మంత్రుల్ని క‌లిసి అందించచ‌డం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో తాజాగా బాల‌కృష్ణ తరుపున 50 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్ ను ఆయ‌న చిన్న‌ కుమార్తె తేజ‌స్వీని నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సీఏం రేవంత్ ని క‌లిసి అందించారు.

అనంత‌రం కాసేపు ఇరువురి మ‌ధ్య చిన్న పాటి మాట మంతి జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. నిన్నటి రోజునే బాలకృష్ణ అమరావతి వచ్చి సీఎం చంద్రబాబుకు రూ.50 లక్షల చెక్ అందజేశారు. రెండు రాష్ట్రాల‌కు క‌లిపి ఆయ‌న కోటి విరాళం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగానే బాల‌య్య బిజీ షెడ్యూల్ కార‌ణంగా నేడు కుమార్తెని పంపించిన‌ట్లు తెలుస్తోంది. తేజ‌స్విని ఇంత‌వ‌ర‌కూ ఇలా రాజ‌కీయ నాయ‌కుల్ని క‌లిసింది లేదు.

కుటుంబ వ్య‌వ‌హారా లు..బిజినెస్ లు చూసుకునేవారు. ఇటీవ‌లే నిర్మాత‌గా కూడా ఎంట్రీ ఇచ్చారు. సోద‌రు డు మోక్ష‌జ్ఞ చిత్రాన్ని ఆమె స్వ‌యంగా నిర్మిస్తున్నారు. ఇక‌పై కంటున్యూగా సినిమాలు చేసే అవ‌కాశం ఉంది. త‌దుప‌రి సినిమా ఈవెంట్లో ల‌కూడా తేజ‌స్వీని ప్ర‌త్య‌క్ష‌మ‌య్యే అవ‌కాశం ఉంటుంది. బాల‌కృష్ణ పెద్ద కుమార్తె, లోకేష్ స‌తీమ‌ణి బ్రాహ్మాణి ఎన్నిక‌ల్లో ప్ర‌చారంలో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే.

అప్ప‌టి వ‌ర‌కూ ఆమె బిజినెస్ వ్య‌వ‌హారాలు చూసుకున్నారు. ఇప్పుడు ఆమె కూడా చిన్న‌గా రాజ‌కీయ వ్య‌వ‌హారాల్లోనూ భాగ‌మ‌వుతున్నారు. సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గా క‌నిపిస్తున్నారు.

Tags:    

Similar News