'ది రాజా సాబ్‌'.. డార్లింగ్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్!

'ది రాజా సాబ్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నవంబర్ నెలాఖరులోపు తన పోర్షన్ షూటింగ్ మొత్తం పూర్తి చేసి, తన కొత్త సినిమా సెట్స్ లో అడుగుపెట్టాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడట.

Update: 2024-10-09 07:18 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. మారుతీ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "ది రాజా సాబ్". ఇదొక రొమాంటిక్ హారర్ కామెడీ. డార్లింగ్ తన కెరీర్ లోనే తొలిసారిగా ఇలాంటి జోనర్ లో నటిస్తున్నారు. ఇందులో ఆయన సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, ఫ్యాన్ ఇండియన్ గ్లింప్స్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు వారిని మరింత ఎగ్జైట్ చేసే ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

'ది రాజా సాబ్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నవంబర్ నెలాఖరులోపు తన పోర్షన్ షూటింగ్ మొత్తం పూర్తి చేసి, తన కొత్త సినిమా సెట్స్ లో అడుగుపెట్టాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతం హైదరాబాద్‌ నగర శివార్లలో వేసిన ఓ భారీ సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ మీద ఓ కీలకమైన అండర్‌ వాటర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ను షూట్ చేస్తున్నారని సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

'రాజా సాబ్' హార్రర్ కామెడీ కాబట్టి గ్రాఫిక్స్ కి అధిక ప్రాధాన్యత ఉండనుంది. వీలయినంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ మీదకు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు మారుతి. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసారు. ప్రభాస్ ఎపిసోడ్‌లు, సాంగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. నిన్న డైరెక్టర్ బర్త్ డే సందర్భంగా సెట్స్ నుంచి షూటింగ్‍కు సంబంధించిన ఓ మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సాహంగా చిత్రీకరణ చేస్తున్నట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. చివర్లో హీరో ప్రభాస్.. మారుతి భుజంపై చేయి వేసి నిలబడిన స్టిల్ హైలైట్‍గా నిలిచింది.

'ది రాజా సాబ్' సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ వంటి ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకి ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ని మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకుందని టాక్.

రాజా సాబ్ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ప్రభాస్ 'ఫౌజీ' సెట్స్‌లో జాయిన్ అవుతాడు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇదే క్రమంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' సినిమా చేయనున్నారు. 'సలార్ 2' 'కల్కి 2898 AD' పార్ట్-2 చిత్రాలు కూడా ప్రభాస్ లైనప్ లో ఉన్నాయి.

Tags:    

Similar News