శ్రీనువైట్ల 'జర్నీ ఆఫ్ విశ్వం'.. గోపి యాక్షన్ ప్లస్ కామెడీ

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్.. ప్రస్తుతం విశ్వం మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-07-31 07:41 GMT

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్.. ప్రస్తుతం విశ్వం మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. గోపీచంద్, శ్రీను వైట్ల కాంబోలో ఈ సినిమా వస్తుండడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్.. సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది. మూవీపై పాజిటివ్ క్రియేట్ చేసింది. గోపీచంద్ కు హిట్ దక్కుతుందనే ధీమా కల్పించింది.


తాజాగా విశ్వం మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. జర్నీ ఆఫ్ విశ్వం పేరుతో షూటింగ్ గ్లింప్స్ ను షేర్ చేశారు. బ్యూటిఫుల్ లొకేషన్స్.. హై యాక్షన్ సీన్స్.. ఫుల్ కామెడీతో మిమ్మల్ని అలరించే ఎంటర్టైనర్ విశ్వం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే వీడియోలో సినిమా షూటింగ్ కు సంబంధించిన విజువల్స్ తోపాటు యాక్షన్ సీన్స్ ను చూపించారు మేకర్స్. విశ్వం మూవీలోని ఎక్కువ పార్ట్ ను ఇటలీలోనే షూట్ చేసినట్లు లేటెస్ట్ వీడియో ద్వారా ఈజీగా అర్థమవుతుంది.

బ్యూటిఫుల్ లొకేషన్స్, ఎత్తైన కమర్షియల్ బిల్డింగ్స్, బీచెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక వీడియో బట్టి చిత్రంలో యాక్షన్‌తో పాటు కామెడీకి ఏమాత్రం కొదువ లేదని పక్కా చెప్పవచ్చు. శ్రీను వైట్ల తన మార్క్ కామెడీని చూపించనున్నట్లు తెలుస్తోంది. ట్రైన్ లో కామెడీ సీన్ ను షూట్ చేస్తున్నట్లు చూపించారు. అందులో నరేష్, వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్, ప్రగతి, రచ్చ రవి తదితరులు కనిపించారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

అయితే శ్రీను వైట్ల తెరకెక్కించిన వెంకీ మూవీలోని ట్రైన్ కామెడీ సీన్ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే మీమ్స్ లో ఆ సీన్ బిట్సే వాడుతుంటారు అందరూ. ఇప్పుడు మళ్లీ అదే రేంజ్ లో ట్రైన్ కామెడీని విశ్వం సినిమాలో శ్రీను వైట్ల చూపించబోతున్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనా ఈ సినిమా కోసం శ్రీను వైట్ల బాగా కష్టపడినట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఈ సినిమాతో గోపీచంద్ తో పాటు శ్రీను వైట్ల మంచి హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు.

ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. చిత్రాలయం బ్యానర్ కూడా సహ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తోంది. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ కు చెందిన అనేక మంది నటీనటులు యాక్ట్ చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమా గోపీచంద్, శ్రీను వైట్లకు ఎలాంటి హిట్ ఇస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News