ఉత్సవం.. సక్సెస్ మీట్‌లో చిత్ర యూనిట్ జోష్

సెప్టెంబర్ 13న విడుదలైన ఉత్సవం సినిమా ప్రేక్షకులను అలరించి, మంచి స్పందన పొందింది.

Update: 2024-09-18 14:00 GMT

తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల హార్ట్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలకు అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతోంది. ఇక రీసెంట్ గా అదే జానర్ లో వచ్చిన ఉత్సవం గత ఫ్రైడే రిలీజ్ అయ్యింది . హీరో దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అర్జున్ సాయి రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని హార్న్‌బిల్ పిక్చర్స్ నిర్మించింది.

సక్సెస్ మీట్ సందర్భంగా మేకర్స్ వారి ఆనందాన్ని పంచుకున్నారు. దిలీప్ ప్రకాష్ మాట్లాడుతూ, "ముందుగా మీ అందరికీ నమస్కారం. మా సినిమా చూసి స్పందించిన ప్రతి ఒక్కరికీ థాంక్ యూ. మీడియా కూడా మా సినిమా ప్రమోషన్‌లో సపోర్ట్ చేసింది, అందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మా చిత్రం సక్సెస్ టూర్ చేయబోతున్నాం, అందరూ ఈ సినిమా చూడండి" అని అన్నారు.

యాక్టర్ అలీ మాట్లాడుతూ, "నాటక రంగం నుండి వచ్చిన కళాకారులందరూ పరిశ్రమలో ఎదిగారు. సురభి నాటక రంగం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఉత్సవం వంటివి మంచి సినిమాలను ప్రేక్షకులు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా మంచి నటీనటులతో కలిసి పని చేసే అవకాశం దక్కింది" అని అన్నారు.

డైరెక్టర్ అర్జున్ సాయి మాట్లాడుతూ, "నాటకం గొప్ప కళ. నాటకాన్ని ఆధారంగా తీసుకుని నా మొదటి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో లవ్ స్టోరీ మరియు ఫ్యామిలీ డ్రామా ఉంది, ప్రముఖ నటీనటులు అందరూ కూడా వారి టాలెంట్ తో సినిమాను మరో లెవెల్ కు తీసుకు వెళ్లారు. చూసిన ప్రతీ ఒక్కరు కూడా అద్భుతమైన ప్రయత్నం అని ప్రశంసలు అందిస్తున్నారు" అని తెలిపారు.

నిర్మాత సురేష్ పాటిల్ మాట్లాడుతూ, "ఈ కథలో లవ్ స్టోరీ మరియు గొప్ప కళాకారులు ఉన్నారు.తప్పకుండా అందరూ ఈ సినిమాను చూసి మరింత సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకుల సపోర్ట్ ఉంటే మరిన్ని సినిమాలు చేస్తాను" అన్నారు.

రైటర్ రమణ గోపిశెట్టి మాట్లాడుతూ, "ఈ సినిమాకు మంచి పేరు వస్తోంది. ఇందులో అద్భుతమైన లవ్ స్టోరీ ఉంది. దర్శకుడు చాలా మంచి పని చేశాడు," అన్నారు. ఇక యాక్టర్ వెంకట గిరిధర్ మరియు అభినయ కృష్ణ కూడా తమ అభిప్రాయాలు పంచుకున్నారు, "ఈ సినిమా మాన్ కల్చర్ మరియు నాటకంపై అద్భుతంగా చూపించింది. దిలీప్ చాలా నేచురల్‌గా పెర్ఫామ్ చేశాడు" అని పేర్కొన్నారు.

Tags:    

Similar News