30 ఏళ్ళు వెనక్కి వెళుతున్న వరుణ్

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్

Update: 2023-07-22 10:25 GMT

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ మొదటి నుంచి ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్​లో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన గాండీవధారి అర్జున అనే భారీ బడ్జెట్​ సినిమా చేశారు. ఆగస్టు 25న సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీని తర్వాత వరుణ్‌.. 'పలాస 1978', 'శ్రీదేవి సోడా సెంటర్' దర్శకుడు కరుణ కుమార్​తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

దర్శకుడు కరుణ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. పలాసతో సూపర్ హిట్​ను అందుకున్నారు. ఆ తర్వాత సుధీర్ బాబు హీరోగా 'శ్రీదేవి సోడా సెంటర్'ను తెరకెక్కించారు.

ఇది యావరేజ్​గా ఆడింది. ఇప్పుడు వరుణ్ తేజ్​తో కలిసి మరో డిఫరెంట్​గా కాన్సెప్ట్​ సినిమా తీయనున్నారు. తాజాగా దీనిపై ఓ సమాచారం అందింది. దర్శకుడు మరో 30 ఏళ్ళు వెనక్కి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా.. 1990ల బ్యాక్​డ్రాప్​లో సాగనుందని తెలిసింది. చాలా రీసెర్చ్ చేసి దర్శకుడు కథను సిద్ధం చేశారట. ఇప్పటి వరకు కెరీర్​లో చేయనటువంటి పాత్రలో వరుణ్ తేజ్​ కనిపిస్తారని ఇన్​సైడ్​ టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర కోసం వరుణ్​ తన మేకోవర్​ను మార్చుకోనున్నారట.

ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్​తో వైరా ఎంటర్​టైన్మెంట్స్​ బ్యానర్​పై విజేందర్ రెడ్డి తీగల, మోహన్​ చేకూరి నిర్మించనున్నారు. ఇప్పటికీ ఈ బ్యానర్​లో నాని 30 'హాయ్​ నాన్న' రూపొందుతోంది. ఒకవేళ వైరా ఎంటర్​టైన్మెంట్స్​ అనుకున్నట్టుగానే భారీ బడ్జెట్​తో రూపొందిస్తే వరుణ్​ కెరీర్​లో ఇదే పెద్ద సినిమా అవుతుంది.

ఇకపోతే ఈ చిత్రాన్ని జులై 27న లాంఛ్ చేయనున్నారని ఇంతకముందు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్​ను సంగీత దర్శకుడిగా తీసుకునే ఆలోచనలో మూవీటీమ్​ ఉందట. ఆయనతో చర్చలు సాగిస్తున్నారని ఆ మధ్యలో వార్తలు వచ్చాయి. ఈ చిత్రంతో పాటు శక్తి ప్రతాప్‌ సింగ్​ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చేయనున్నారట వరుణ్​

Tags:    

Similar News