'కింగ్‌డమ్' స్పీడ్ పెంచిన దేవరకొండ

కాగా, ఇప్పుడు సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టా స్టోరీలో ఓ స్టన్నింగ్ ఫోటోను షేర్ చేశారు.;

Update: 2025-04-15 13:00 GMT
కింగ్‌డమ్ స్పీడ్ పెంచిన దేవరకొండ

నెక్స్ట్ ప్యాన్ ఇండియా టార్గెట్‌తో రాబోతున్న సినిమా కింగ్‌డమ్. విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. కాగా, ఇప్పుడు సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టా స్టోరీలో ఓ స్టన్నింగ్ ఫోటోను షేర్ చేశారు.

 

డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో కలిసి డబ్బింగ్ స్టూడియో బయట మాట్లాడుతున్న విజయ్ కింగ్‌డమ్ స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ డన్.. అంటూ క్లారిటీ ఇచ్చారు. అంటే తొలి భాగానికి డబ్బింగ్ పూర్తయిందన్నమాట. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ ప్రకటించడంతో నెక్స్ట్ అప్డేట్ త్వరలోనే రానున్నట్లు ఓ క్లారిటీ వచ్చేసింది. అంటే అసలైన ట్రైలర్ అప్డేట్ కూడా త్వరలోనే రావచ్చని తెలుస్తోంది.

ఇది చూస్తే, కింగ్‌డమ్ సినిమా నిర్మాణానంతర దశ వేగంగా సాగుతోంది అని స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు కూడా పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని సమాచారం. డబ్బింగ్ పూర్తవుతున్న నేపథ్యంలో, ఆడియో, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్లను మెరుగైన ప్రెజెంటేషన్‌తో ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు.

గౌతమ్ తిన్ననూరి కూడా ఈసారి పూర్తిగా యాక్షన్ బేస్డ్ నేరేటివ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇది రెండు పార్ట్స్‌గా ప్లాన్ చేయబడింది అనే టాక్ ట్రేడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మే 30న సినిమాను విడుదల చేయాలన్నది అసలు ప్లాన్. విజయ్ ప్రస్తుతం వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెడుతున్నారు. ఇటీవల వచ్చిన గ్యాప్‌ను కింగ్‌డమ్ తో ఖచ్చితంగా ఫుల్ చేయాలని చూస్తున్నారు. గౌతమ్ డైరెక్షన్‌లో కొత్త తరహా కథనంతో, టెక్నికల్ రిచ్ ప్రెజెంటేషన్‌తో ఈ సినిమా విజయవంతం అయితే విజయ్ కెరీర్‌లో మరొక బిగ్ హిట్ గా నిలవొచ్చు.

Tags:    

Similar News