మాస్‌ కా దాస్ తో పవన్ హీరోయిన్‌...!

స్క్రిప్ట్‌ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్‌ గా ప్రియాంక మోహన్‌ నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి.

Update: 2024-09-24 14:30 GMT

యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుని మాస్ కా దాస్ అనిపించుకుంటూ వరుస సినిమాలు చేస్తున్న యంగ్‌ హీరో విశ్వక్ సేన్‌. ప్రస్తుతం మెకానిక్‌ రాకీ సినిమాను చేస్తున్న విశ్వక్‌ సేన్ ఇటీవలే జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు. మొదటి సినిమా తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న అనుదీప్ తదుపరి సినిమా నిరాశ పరిచింది. దాంతో కాస్త గ్యాప్ తీసుకుని మంచి స్క్రిప్ట్‌ తో యూత్‌ ఆడియన్స్ కి కనెక్ట్‌ అయ్యే విధంగా విశ్వక్ సేన్ తో సినిమాను చేసేందుకు దర్శకుడు అనుదీప్ కేవీ రెడీ అవుతున్నాడు. స్క్రిప్ట్‌ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్‌ గా ప్రియాంక మోహన్‌ నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌ లో ఎక్కువగా వినిపిస్తున్న హీరోయిన్స్ పేర్లలో ప్రియాంక మోహన్‌ పేరు ఒకటి. పవన్‌ కళ్యాణ్ తో కలిసి ప్రతిష్టాత్మక మూవీ 'ఓజీ' లో నటిస్తున్న ప్రియాంక మోహన్‌ ఇటీవలే నానితో కలిసి సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో ప్రియాంక మోహన్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. అంతే కాకుండా అందంగా కనిపిస్తూ అలరించింది. అందుకే ప్రియాంక మోహన్‌ కి మరిన్ని ఆపర్లు వస్తున్నాయి. తాజాగా విశ్వక్‌ సేన్‌ సినిమా కోసం దర్శకుడు అనుదీప్ ఆమెని ఎంపిక చేయడం జరిగిందని తెలుస్తోంది.

విశ్వక్‌ సేన్‌ హీరోగా అనుదీప్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా లో ప్రియాంక మోహన్‌ నటించడం ద్వారా ప్రాజెక్ట్‌ క్రేజ్ కచ్చితంగా భారీగా పెరగడం ఖాయం అనడంలో సందేహం లేదు. వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో, క్రేజీ ప్రాజెక్ట్‌ ల్లో నటిస్తున్న ప్రియాంక మోహన్‌ విశ్వక్‌ సేన్‌ సినిమాలో నటించడం కచ్చితంగా పెద్ద విషయమే అనే అభిప్రాయాన్ని సినీ మీడియా వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. విశ్వక్‌ సేన్ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం మినిమం గ్యారెంటీ అన్నట్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కనుక అనుదీప్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా సైతం ప్రేక్షకులను అలరించే అవకాశాలు ఉన్నాయి.

ప్రియాంక మోహన్‌ టాలీవుడ్‌ లో నాని గ్యాంగ్‌ లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఆమె పాత్రకు, లుక్ కి మంచి పేరు వచ్చింది. దాంతో వెంటనే శ్రీకారం సినిమాలో నటించింది. శర్వానంద్‌ హీరోగా చేసిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో కాస్త గ్యాప్‌ ఇచ్చి వరుసగా తమిళ్ సినిమాల్లో నటించింది. మూడు సంవత్సరాల తర్వాత తెలుగు లో నానితో కలిసి సరిపోదా శనివారం సినిమా చేయడం ద్వారా విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు లో ఈ అమ్మడి జర్నీ ఇక నుంచి ఫుల్‌ బిజీ బిజీగా సాగే అవకాశాలు ఉన్నాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News