‘రతన్ టాటా’కు 11 వేల రత్నాలతో నివాళి.. చూడాల్సిందే

చివరకు తానే కలుగజేసుకొని ఆ ప్రచారాన్నిఆపాలని కోరిన విశిష్ఠ వ్యక్తిత్వం రతన్ టాటాది.

Update: 2024-10-14 07:32 GMT

ఒక భారతీయ ప్రముఖుడికి భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలంటూ ప్రజల నుంచి వినతులు రావటమే కాదు.. ఆన్ లైన్ లో ఉద్యమం మొదలు కావటం.. చివరకు తానే కలుగజేసుకొని ఆ ప్రచారాన్నిఆపాలని కోరిన విశిష్ఠ వ్యక్తిత్వం రతన్ టాటాది. భారతీయులు తమ జాతిరత్నంగా భావించే ఆయన గత వారంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవటం తెలిసిందే. తన పేరులోనే రత్నాన్ని ఇముడ్చుకున్న అసలుసిసలైన భారతీయ రత్నానికి ఘన నివాళిని అర్పించేందుకు గుజరాత్ కు చెందిన ఒక వజ్రాల వ్యాపారి చేసిన ప్రయోగం విపరీతంగా ఆకట్టుకుంటోంది.


సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి లాబ్ లో తయారు చేసిన 11 వేల వజ్రాలతో ఆయన చిత్తరువును చేయించారు. దీన్ని రూపొందించే క్రమంలో వీడియోను తీసిన ఆయన.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రతన్ టాటా మీద అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా ప్రదర్శిస్తే.. ఈ సూరత్ వజ్రాల వ్యాపారి మాత్రం వేలాది రత్నాలతో చిత్తరువును రూపొందించారు.

ఈ వ్యాపారి పేరు విఫుల్ భాయ్. ఆయన పోస్టు చేసిన వీడియో.. ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక భారీ రత్నానికి వేలాది రత్నాలు పోటీ పడి మరి ఒక చోట కుదురుగా కూర్చుంటే ఎంత అద్భుతమైన చిత్తరువు తయారవుతుందన్న దానికి నిదర్శనంగా ఈ ఫోటో నిలుస్తుంది. రత్నానికి వేలాది రత్నాలతో అర్పించిన నివాళి జాతి జనుల మనసుల్ని దోచేస్తోంది. వియు మిస్ యూ రతన్ టాటా.

Tags:    

Similar News