బాబుకు అనూహ్యమైన సన్నివేశం

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అనూహ్యమైన సన్నివేశం కనిపించింది

Update: 2024-01-13 19:00 GMT

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అనూహ్యమైన సన్నివేశం కనిపించింది. ఆయన విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి వచ్చారు. ఉచిత ఇసుక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం కేసుల్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఆయన సీఐడీ కార్యాలయంలో ఉచిత ఇసుక కేసులో పూచీకత్తును సమర్పించారు. దర్యాప్తు అధికారులకు పూచీకత్తు, బాండ్ సమర్పించారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు రాక సందర్భంగా సీఐడీ కార్యాలయం వద్ద పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే అక్కడకు భారీగా చేరుకున్న టీడీపీ అభిమానులు బ్యారికేడ్లను తోసుకుని ముందుకు వచ్చారు. దాంతో వారంతా బాబును చూసేందుకు ఉత్సాహపడ్డారు. అంతే కాదు చంద్రబాబుపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని నినాదాలు చేశారు.

ఇక సీఐడీ ఆఫీసు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు తన కోసం వచ్చిన వారికి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగిపోయారు. సీఐడీ ఆఫీసుకు బాబు రావడం ఏమో కానీ బయట జనాల నుంచి వచ్చిన స్పందన మాత్రం ఆయనకు అపరిమితమైన ఆనందాన్ని ఇచ్చిందనే అంటున్నారు. ఎవరూ ఊహించని విధంగా జనాలు అక్కడ చేరుకున్నారు. తెలుగుదేశం జనసేన జెండాలు రెండూ కూడా బాబు ముందు కనిపించడం పూల జల్లు కురిపిస్తూ ఆయనకు స్వాగతం పలకడం విశేష పరిణామమే అంటున్నారు.

Tags:    

Similar News