హైదరాబాద్ లో క్రాకర్ షాపులో అగ్నిప్రమాదం వెనుక కుట్ర?

హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్ లో చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదం ఇప్పుడు సంచలనంగా మారింది.

Update: 2023-11-11 10:30 GMT

హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్ లో చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదం ఇప్పుడు సంచలనంగా మారింది. తాజాగా అందుబాటులోకి వచ్చిన సీసీఫుటేజ్ సరికొత్త సందేహాలకు తెర తీసింది. దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసే క్రాకర్ షాపు దగ్గర అనుమానాస్పదంగా సంచరించిన వ్యక్తి వైనం కలకలాన్ని రేపుతోంది. ఈ తెల్లవారుజామున (శనివారం) రాజేంద్రనగర్ సన్ సిటీ వద్ద చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం ధాటికి మూడు షాపులు అగ్నికి ఆహుతి అయ్యాయి.

తొలుత క్రాకర్ షాపు వద్ద మంటలు చెలరేగటం.. అనంతరం దాని పక్కనే ఉన్న దుర్గా భవాని ఫుడ్ జోన్ కు మంటలు వ్యాపించాయి. ఇదే సమయంలో ఫుడ్ కోర్టులో ఉన్న గ్యాస్ సిలిండర్ మంటల ధాటికి పేలిపోవటంతో అగ్నిప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఈ తీవ్రతకు మూడు షాపులు తగలబడిపోయాయి. మరో నాలుగుషాపుల్లోనూ మంటల ఎగిసిపడ్డాయి. అయితే.. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించటంతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.

దాదాపు నాలుగు గంటల పాటుకష్టపడి మంటల్ని అదుపులోకి తేవటం ఒక ఎత్తు అయితే.. తాజాగా లభించిన సీసీ కెమేరాల్లో క్రాకర్ షాపు వద్ద తిరిగిన వ్యక్తి ఆనవాళ్లు అనుమానాస్పదంగా మారాయి. దీంతో.. కుట్ర కోణం ఏమైనా ఉందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ అగ్నిప్రమాద ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ అగ్నిప్రమాద ఉదంతంపై అధికారులు మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News