విద్యార్థినిపై ముగ్గురు టీచర్ల గ్యాంగ్ రేప్... తమిళనాట ఘోరం!

ఇందులో భాగంగా... ఓ విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సాముహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.

Update: 2025-02-06 07:31 GMT

కంచె చేను మేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. విద్యర్థులకు విద్యాబుద్ధులు చెప్పించి, స్కూల్లో వారికి తల్లితండ్రుల తరహా రక్షణ సైతం కల్పించాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారారు. ఇందులో భాగంగా... ఓ విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సాముహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అత్యంత ఘోరమైన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

అవును... 30, 40, 50 ఏళ్లు దాటిన ముగ్గురు ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులు 13 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారనే ఘటన తాజాగా తీవ్ర కలకలం రేపుతోంది! దీంతో... సభ్య సమాజం తల దించుకునేలా కూతురి వయసున్న అమ్మాయిపై ఇలా మృగాలుగా మారి ప్రవర్తించిన ముగ్గురు టీచర్స్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు!

వివరాళ్లోకి వెళ్తే... తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాలోని ప్రహుత్వ పాఠశాలలో మైనర్ విద్యార్థిపై ముగ్గురు ఉపాధ్యాయులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో సదరు విద్యార్థిని గర్భం దాల్చింది. ఈ సమయంలో జరిగిన విషయం తన తల్లికి చెప్పింది. దీంతో ఆమె.. తన బిడ్డను గత నెల రోజులుగా స్కూల్ కి పంపించలేదు!

ఈ సమయంలో స్కూల్ కి సెలవు పెట్టి మరీ అబార్షన్ కోసం సదరు విద్యార్థిని తల్లి ప్రయత్నించారట. ఈ క్రమంలో ఈ విషయం పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి తెలిసిందని అంటున్నారు. దీంతో... దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ఈ విషయంపై శిశు సంక్షేమ అధికారులను అశ్రయించి, బాధితురాలితో ఫిర్యాదు చేయించారు.

వెంటనే... అధికారులు సదరు విద్యార్థిని కృష్ణగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముగ్గురు ఉపాధ్యాయులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని డీఈవో సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉపాధ్యాయులు వరుసగా చిన్నస్వామి (57), ప్రకాశ్ (37), ఆర్ముగం (45) గా చెబుతున్నారు. ఈ ఘటన బయటకు రావడంతో.. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు, విద్యార్థుల తల్లితండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క స్టాలిన్ సర్కార్ పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News