తల్లి, చెల్లిపై కోర్టుకెక్కిన వ్యవహారం... స్పందించిన జగన్!

అవును.... ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న జగన్ - షర్మిలల ఆస్తుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-10-24 09:24 GMT

ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం దీపావళి కానుక, ఢిల్లీలో ఏపీ మంత్రుల బిజీ, జగన్ విజయనగరం పర్యటన కంటే ఎక్కువగా తన చెల్లి తల్లిపై వైసీపీ అధినేత లీగల్ చర్యలు హాట్ టాపిక్ గా మారాయనే చెప్పాలి. ఈ విషయంలో జగన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారనే చర్చా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై జగన్ స్పందించారు.

అవును.... ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న జగన్ - షర్మిలల ఆస్తుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా ఉంది. ఈ సమయంలో ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ఇందులో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

తాను గుర్లకు వస్తున్నానని తెలిసి మళ్లీ రాజకీయం చేస్తున్నారని.. మా కుటుంబ విషయాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని.. ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే లడ్డూ అంశం తెరపైకి తెచ్చారని.. తెలుగుదేశం పార్టీ అక్రమాలు బయటపెడుతున్నామనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్ అన్నారు.

ఈ నేపథ్యంలోనే.. ఇప్పుడు అమ్మ, చెల్లెలు ఫోటో పెట్టి రాజకీయం మొదలుపెట్టారని.. ఇవన్నీ ప్రతీ ఇంట్లో ఉన్న విషయాలే అని.. వీటిని చంద్రబాబు తన స్వార్ధం కోసం పెద్దవి చేసి చూపిస్తున్నారని.. వాస్తవాలను వక్రీకరించి చూపిస్తున్నారని.. ఇవన్నీ మానుకుని ప్రజలపై ద్యాస పెట్టాలని.. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై దృష్టి సారించాలని జగన్ సూచించారు.

కాగా... సుమారు ఐదేళ్ల కిందట కుదుర్చుకున్న ఒప్పందం గురించి ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీలో వివాదం రేగుతోన్న సంగతి తెలిసిందే. అప్పట్లో తల్లికి గిఫ్ట్ డీడ్ రూపంలో ఇచ్చిన షేర్లను రద్దు చేయాలంటూ జగన్ ఏకంగా ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై షర్మిళ ఘాటు లేఖ రాశారు. అయితే... ఇది అన్ని ఇళ్లల్లోనూ ఉండేదే అని జగన్ తాజాగా స్పందించారు.

Tags:    

Similar News