జనసేన విషయంలో 'తుపాకీ' చెప్పిన జోస్యం నిజమైంది !

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే జనసేనలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయన్న దాని మీద చాలా రోజుల క్రితమే సరిగ్గా అంచనా కట్టింది.

Update: 2024-06-12 05:30 GMT

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే జనసేనలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయన్న దాని మీద చాలా రోజుల క్రితమే సరిగ్గా అంచనా కట్టింది. దానికి తగినట్లుగా ఈ రోజు జనసేనకు మూడు మంత్రి పదవులు దక్కాయి. అందరూ అనుకున్నట్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కాబోతున్నారు.

ఇక జనసేనలో నంబర్ టూగా ఉన్న నాదెండ్ల మనోహర్ కి మంత్రి పదవి దక్కుతుందని కూడా తుపాకీ చెబుతూ వచ్చింది. అది నిజం అయింది. ఇక ఎవరూ ఊహించని విధంగా ఆయన పక్కాగా మంత్రి అవుతారు అని తుపాకీ ముందే చెప్పింది . ఆయనే నిడదవోలు నుంచి జనసేన తరపున గెలిచిన కందుల దుర్గేష్.

దుర్గేష్ కి మంత్రి పదవి దక్కుతుందని మొదటి నుంచి తుపాకీ రాస్తూ వస్తోంది. కందుల దుర్గేష్ 2019లో తొలిసారిగా రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసి భారీ స్థాయిలో ఓట్లు సాధించారు. ఆయన తూర్పు గోదావరి జిల్లాలో జనసేన కోసం కష్టపడే నేచర్ ఉన్న లీడర్ గా అందరి మన్ననలూ పొందారు.

ఆయన అంటే కేవలం కాపు సామాజిక వర్గానికే కాదు అందరికీ అభిమానం ఉంది. ఆయన సైతం అందరితో కలిసిపోతారు. అన్ని వర్గాల మేలు కోరుకుంటారు. సౌమ్యుడిగా పనిమంతుడుగా పేరు తెచ్చుకున్న కందుల దుర్గేష్ పార్టీకి పవన్ కి వీర విధేయుడు. తనకు రాజమండ్రి రూరల్ లో సీటు కాదని నిడదవోలు ఇచ్చినా అక్కడికి వెళ్లి బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. సమర్ధుడిగా ప్రజల కోసం ఎంతో సేవ చేయాలని తపించే నేతగా కందుల దుర్గేష్ ఉన్నారు.

ఆయనకు మంత్రి పదవి దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కందులకు మంత్రి పదవి అంటే మాకే అని ప్రతీ సగటు మనిషి అనుకునే విధంగా సంబరాలు చేసుకుంటున్నారు. కష్టపడిన వారికి అంకితభావంతో ముందుకు వెళ్లే వారికి మంచి జరుగుతుందని ఎపుడూ రుజువు అవుతున విషయం. అలా కందుల దుర్గేష్ కి మంత్రి పదవి దక్కింది అని అంటున్నారు.

అలా కందుల దుర్గేష్ ఇపుడు అమాత్య హోదాలోకి వెళ్తున్నారు. ఆయన తనకు లభించిన ఈ సువర్ణ అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని ప్రజలకు మరింత సేవ చేస్తారు అని అంతా నమ్ముతున్నారు. కందుల దుర్గేష్ కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఆయన నాయకత్వంలో గోదావరి జిల్లాలో మరింత అభివృద్ధి జరుగుతుందని అంతా ఆశిస్తున్నారు. కంగ్రాట్స్ దుర్గేష్ అని వెల్లువలా అభిమాన జనం అయనను గ్రీట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే జనసేన ఇక ముందు తనదైన పనితీరుతో ఏపీ ప్రజలను మెప్పిస్తుందని అంతా అంటున్నారు.

Tags:    

Similar News