పవన్ అచ్చం ఆయనలా ఉన్నారు.. భూమాన వ్యాఖ్యలు

టీటీడీ మాజీ ఛైర్మన్.. వైసీపీ కీలక నేతల్లోఒకరైన భూమన కరుణాకర్ రెడ్డికి కోపం వచ్చింది.

Update: 2024-10-04 04:52 GMT

టీటీడీ మాజీ ఛైర్మన్.. వైసీపీ కీలక నేతల్లోఒకరైన భూమన కరుణాకర్ రెడ్డికి కోపం వచ్చింది. అది కూడా తనకు అడ్డా లాంటి టీటీడీలో ఘోరం జరిగినట్లుగా ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన గరం గరంగా ఉన్నారు. సనాతన ధర్మం గురించి పవన్ మాట్లాడటం ఏమిటి? ఇంతకాలం వినిపించని సనాతన ధర్మాన్ని ఇప్పుడెందుకు వినిపిస్తున్నట్లు?లాంటి సందేహాలతో పాటు పవన్ పై సెటైర్లు వేయటం ఆసక్తికరంగా మారింది.

తిరుపతిలో నిర్వహించిన సనాతన ధర్మం డిక్లరేషన్ పై ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడిన తీరు.. ఆయన ఆగ్రహం.. ఆయన ప్రస్తావించే అంశాలు.. ప్రశ్నించే ప్రశ్నలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీస్తున్నాయి. ఇంతకాలం సెక్యులరిస్టుల పేరుతో వాదనలు వినిపించే వారికి షాకిచ్చేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నట్లుగా చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పవన్ ప్రసంగంపై భూమన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

సనాతన ధర్మంపై పవన్ ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదన్న భూమన.. ‘‘పవన్ కొత్త పాఠం వెనుక వేరే అజెండా ఉంది. పవన్ స్వాములవారు పూటకో మాట మాట్లాడుతున్నారు’’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేయటం గమనార్హం. పవన్ ప్రసంగం చేసిన తీరు వైష్ణవ ప్రచారం చేసిన ఆళ్వార్ లా మాట్లాడుతున్నట్లుగా ఎద్దేవా చేశారు. అయోధ్యకు పంపిన లక్ష లడ్డూల్లో జంతకు కొవ్వు ఉందని ఎవరు చెప్పారు? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో ఉన్న అంశంపై పవన్ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. మొత్తంగా పవన్ చేసిన సనాతన ధర్మం డిక్లరేషన్ భూమనకు బాగానే తాకిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News