రెడ్‌ బుక్‌ పేరు వింటేనే గజగజ... జగన్, పేర్నిపై మంత్రి కీలక వ్యాఖ్యలు!

ఈ సమయంలో మంత్రి కొల్లు రవీంద్ర... మాజీ సీఎం వైఎస్ జగన్, పేర్ని నానిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-06 12:28 GMT

ఏపీలో కూటమి నేతలకూ, వైసీపీ నేతలకూ మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్ లో నడుస్తున్న సంగతి తెలిసిందే. అధికార విపక్ష నేతల వరుస ప్రెస్ మీట్ లతో ఏపీ రాజకీయం వేడెక్కుతోంది. ప్రధానంగా వైసీపీ నుంచి మాజీమంత్రి పేర్ని నాని వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ సమయంలో మంత్రి కొల్లు రవీంద్ర... మాజీ సీఎం వైఎస్ జగన్, పేర్ని నానిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... ఏపీలో కూటమి నేతలు, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.. వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా.. ప్రధానంగా బందర్ లో తన రాజకీయ ప్రత్యర్థి పేర్ని నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను దాచింది పేర్ని నాని అని ఆరోపించారు.

ఇదే సమయంలో తన భద్రత పెంచాలంటూ మాజీ సీఎం జగన్, హైకోర్టును ఆశ్రయించడంపైనా రవీంద్ర స్పందించారు. పులివెందుల ఎమ్మెల్యేకు సీఎం తరహా సెక్యూరిటీ, ప్రధాని తరహా భద్రతా ఉండదనే విషయం తెలుసుకోవాలంటూ హితవు పలికారు. జగన్ తనకు సెక్యూరిటీ పెంచాలని అడుగుతుంటే... ఆయన నుంచి రక్షణ కావాలంటూ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారని రవీంద్ర వ్యాఖ్యానించారు.

ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని జగన్ & కో పీక్కుని తింటే... సీఎం చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారని, అది చూసి ఆ బ్యాచ్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. సుపరిపాలన కోసం సీఎం వాట్సప్ గ్రూపులు పెట్టుకోవాలని అధికారులకు సూచిస్తే... ఈ విషయాన్ని పేర్ని నాని వక్రీకరిస్తున్నారని.. పేర్ని నాని పాపాలు పండుతున్నాయని.. జగన్ పిచ్చికి తగ్గట్టే బందరు పిచ్చోడు పేర్ని నాని తయారయ్యాడని వెటకరించారు.

ఈ నేపథ్యంలోనే రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలు గజగజ వణికిపోతున్నరని చెప్పిన మంత్రి కొల్లు రవీంద్ర... అక్రమాస్తులు, దోపిడి, కుమారుడితో చేయించిన గంజాయి దందా.. ఇవన్నీ బయటకు వస్తాయని పేర్ని నానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజలకు కావాల్సిన సుపరిపాలన అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు రవీంద్ర వెల్లడించారు.

ఏపీలో ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే కౌంటింగ్ కేంద్రం నుంచి కొడాలి నాని, వల్లభనేని వంశీ పారిపోయారని, వారిని దాచిందే పేర్ని నాని అనే అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఇక, హైదరాబాద్ లో అక్రమ ఆస్తులు కొనటానికి వెళ్తే ప్రజలు తరిమారని.. ఇలానే పేర్ని నాని పిచ్చి ప్రేలాపనలు పేలితే ఏపీ ప్రజలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News