రేవంత్ నా కాళ్లు మొక్కారు.. కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.

Update: 2024-09-16 08:48 GMT

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడంతో మొదలైన ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అంతేకాదు.. ఇద్దరి సవాళ్లు, ప్రతిసవాళ్లుచివరకు ఇరువర్గాలు ఘర్షణ చేసుకునే వరకూ తీసుకెళ్లాయి.

అయితే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఈ వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలను ఇప్పుడు మరింత ఆగ్రహానికి గురిచేశాయి.

తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి తన ఇంటికి వచ్చి తన కాళ్లు మొక్కారని కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ అయ్యేందుకు తనకు మద్దతు ఇవ్వాలని కోరారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. రేవంత్‌కు మరో సవాల్ విసిరారు.

రేవంత్‌ను కుర్చీ దింపే వరకూ తాను కాంప్రమైజ్ కానని అన్నారు. అంతరకూ నిద్రపోకుండా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. ‘నీది కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు అంతటి స్థాయి కాదు. వీధి రౌడీ స్థాయికి దిగజారావు’ అని విమర్శించారు. ఒకవేళ తాను హత్యకు గురైతే దానికి రేవంత్ రెడ్డిదే బాధ్యత అని పేర్కొన్నారు.

Tags:    

Similar News