నందిగం సురేష్ కు మరో షాక్... హత్యకేసులో పేరు!

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ పేరు తాజాగా ఓ హత్య కేసులో చేర్చబడినట్లు తెలుస్తోంది.

Update: 2024-09-19 09:08 GMT

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ పేరు తాజాగా ఓ హత్య కేసులో చేర్చబడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనపై టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసు నమోదైన నేపథ్యంలో... తాజాగా గుంటూరు జిల్లా తుళ్లూరులో పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు! ఈ మేరకు ఆయనకు పీటీ వారెంటు కూడా జారీచేశారని తెలుస్తోంది.

అవును... 2020లో తుళ్లూరు మండలం వెలగపూడిలో జరిగిన ఓ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ పేరు ఉందంటూ తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో పీటీ వారెంట్ కూడా జారీ చేశారని అంటున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఇప్పటికే రిమాండ్ లో ఉన్న సురేష్ కి ఇది దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి!

వివరాళ్లోకి వెళ్తే... తుళ్లూరు మండలం, వెలగపూడికి చెందిన మరియమ్మ అనే మహిల 2020లో నాటి వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పెన్షన్ నిలివేశారని, ఇంటి స్థలం ఇవ్వలేదని ఆరోపిస్తూ జగన్ నూ దూషించారు. దీంతో... నందిగం సురేష్ అనుచరులు ఆమె ఇంటిపై దాడికి ప్రయత్నించారు!!

ఈ ఘర్షణల నేపథ్యంలో మరియమ్మపై దాడి జరిగిందని.. ఆ దాడిలో ఆమె మరణించిందని ఆమె కుమారుడు తుళ్లూరు పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశాడు. వాస్తవానికి అప్పుడే తాను ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోలేదని అతడు చెప్పుకొచ్చాడు. దీంతో... ఈ మర్డర్ కేసులో నందిగం సురేష్ పేరు చేర్చినట్లు తెలుస్తోంది!

సురేష్ రిమాండ్ పొడిగింపు!:

మరోవైపు వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వ్యులు జారీ చేసింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇటీవల పోలీసులు రెండు రోజుల పాటు విచారణలో భాగంగా సుమారు 45 ప్రశ్నలు వేసి సమాచారం రాబట్టారని అంటున్నారు!

Tags:    

Similar News