జగన్ గుర్తు సైకిల్ లేదా హస్తం... మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తాం అనే విషయాలను ఓటర్లకు అర్ధమయ్యేలా చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.

Update: 2024-04-02 10:13 GMT

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పోలింగ్ కి ఇంక నెలాపదిరోజుల సమయమే ఉంది. ఈ సమయంలో ఆయా పార్టీల నేతలంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తాం అనే విషయాలను ఓటర్లకు అర్ధమయ్యేలా చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో.. ఎవరి హామీలు నమ్మాలి, ఎవరి హామీలు బ్లఫ్ అని గ్రహించాలనే విషయం ఓటర్ల వ్యక్తిగతం అనే సంగతి కాసేపు పక్కనపెడితే... పార్టీ సింబల్స్ పై మంత్రి ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ఏపీలో ఎవరికి ఓటు వేయాలనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఏ సింబల్ పై ఓటేస్తే అది ఎవరికి చెల్లుతుందనే విషయం కూడా చాలా మంది ప్రజానికానికి ఇప్పటికీ తెలియడం లేదంటూ వైసీపీ కీలక నేత, మంత్రి ధర్మాన ప్రసాద రావు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాలు అన్నట్లుగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా వైఎస్ జగన్ పార్టీ గుర్తు ఏమిటో కూడా కొంతమంది ఓటర్లకు తెలియడం లేదని అన్నారు.

వివరాళ్లోకి వెళ్తే... శ్రీకాకుళం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగుతున్న రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు.. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. ఈ సందర్భంగా తాజాగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురు ఓటర్లతో నేరుగా మాట్లాడారు! ఈ సమయంలో వారికి వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ అని తెలియకపోవడంతో ధర్మాన షాక్ అయ్యారన్ని అంటున్నారు.

ఓటు జగన్ కి వెయ్యాలనుకుంటున్నా... ఆ పార్టీ గుర్తు అడిగితే మాత్రం సైకిల్ లేదా హస్తం అని చెబుతున్నారంట! దీంతో... విషయం గ్రహించారో ఏమో కానీ... ముందుగా వైఎస్ జగన్ పార్టీ వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ అనే విషయం మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఆయన సూచించారు! ఏది ఏమైనా.. ప్రాంతం ఎంత వెనుకబడినట్లు చెబుతున్నా.. అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల గుర్తు తెలియకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే!!

Tags:    

Similar News