లిక్కర్ షాపుల్లో ఎస్పీవై రెడ్డి కుమార్తె హవా.. ఎన్ని షాపులంటే..?

ఈ విషయంలో నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజల పలు దుకాణాలు దక్కించుకున్నారు!

Update: 2024-10-15 05:48 GMT

రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా లాటరీలు తగిలిన వాళ్లు సంబరాల్లో మునిగితేలుతున్నారని అంటున్నారు. ఇక ఈసారి లాటరీల్లో మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా 10 శాతానికి మించి షాపులు దక్కించుకొవడం గమనార్హం. ఈ విషయంలో నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజల పలు దుకాణాలు దక్కించుకున్నారు!

అవును... ఏపీలో జరిగిన లిక్కర్ షాపుల లైసెన్సుల కేటాయింపు ప్రక్రియలో 3,396 దుకాణాలకు గానూ 345 షాపులు.. అంటే 10.20శాతం దుకాణాలు మహిళలు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లాలో లాటరీ ద్వారా 139 దుకాణాలను కేటాయించారు.

ఈ లాటరీలో ఎస్పీవై రెడ్డి కుమార్తె సన్నపురెడ్డి సుజల ఆరు షాపులు దక్కించుకున్నారని అంటున్నారు! మైదకూరులో 111ను సన్నపురెడ్డి సుజల దక్కించుకున్నారు. ఈ జిల్లాలోనే అత్యధికంగా మైదుకూరులోని 124వ షాపుకు 53 దరఖాస్తులు అందాయి. ఈ జిల్లాలో పలు చోట్ల సిండికేట్ వ్యవహారాలు సాగుతున్నాయని అంటున్నారు.

ఇక... అనంతపురం జిల్లాలోనూ సన్నపురెడ్డి సుజల 4 షాపులు దక్కించుకున్నారని అంటున్నారు. ఇదే క్రమంలో కర్నూలులోని పత్తికొండ పరిధిలో 86, 88వ నంబరు దుకాణాలు దక్కాయని చెబుతున్నారు. పీలేరు నియోజకవర్గంలోనూ పలు షాపులను ఆమె దక్కించుకున్నారని తెలుస్తోంది!

Tags:    

Similar News