స్నేహితుడి కోసం హోంమంత్రి అనితకు కాల్ చేసిన బాలయ్య!

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Update: 2024-07-09 09:08 GMT

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆమె అనుచరులు ఓ హోటల్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారనే విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. హోంమంత్రి అనితతో మాట్లాడారంటూ ‘సాక్షి’ మీడియాలో వచ్చిన ఓ కథనం ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... తాజాగా ‘సాక్షి’ మీడియాలో వచ్చిన ఓ కథనం వైరల్ గా మారింది. ఇందులో భాగంగా ఓ రెస్టారెంట్ లో జరిగిన ఘటన విషయంలో అటు అనిత అనుచరులు.. బాలయ్యకు పరిచయస్తుడు అన్నట్లు చెబుతున్న హోటల్ యజమాని మధ్య ఓ వ్యవహారం జరిగిందని, అది కాస్తా ఏకంగా ముఖ్యమంత్రి పేషీకి చేరిందని అంటున్నారు. ఆ వ్యవహారం ఏమిటో ఇప్పుడు చూద్దాం...!

అన్నవరంలోకి "వన్" రెస్టారెంట్ కు హోంమంత్రి అనిత అనుచరులు, టీడీపీ నేతలు వెళ్లారంట. ఆ సమయంలో ఫుడ్ ఆర్డర్ విషయంలో ఆలస్యం జరిగిందని అంటున్నారు. దీంతో... హోటల్ మేనేజర్, సిబ్బంది.. సదరు టీడీపీ నేతలు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.

దీంతో.. ఈ ఘటన విషయాన్ని అమెరికాలో ఉన్న యజమాని దృష్టికి తీసుకెళ్లారంట హోటల్ సిబ్బంది. వెంటనే ఆయన ఈ విషయాన్ని నందమూరి బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారని అంటున్నారు! దీంతో... బాలయ్య నుంచి హోంమంత్రి అనితకు ఫోన్ వెళ్లిందని చెబుతున్నారు. అయినప్పటికీ ఈ వ్యవహారం ఇంకా సద్దుమణగలేదని సమాచారం. దీంతో... ఈ పంచాయతీ కాస్తా ఏకంగా ముఖ్యమంత్రి పేషీకి చేరిందని చెబుతున్నారు.

Full View
Tags:    

Similar News