తెనాలితో దారుణం.. ప్రియుడి దాడితో ప్రియురాలి మృతి

పుట్టిన రోజంటూ ప్రియుడి మాటలకు కారు ఎక్కిన ఆమె తిరిగి అపస్మారకస్థితిలో ఆసుపత్రికి చేరింది. ఆపై మృతి చెందింది.

Update: 2024-10-23 04:53 GMT

పుట్టిన రోజంటూ ప్రియుడి మాటలకు కారు ఎక్కిన ఆమె తిరిగి అపస్మారకస్థితిలో ఆసుపత్రికి చేరింది. ఆపై మృతి చెందింది. తెనాలిలో వెలుగుచూసిన ఈ దారుణం గురించి వింటే షాక్ తినాల్సిందే. కొంతకాలంగా స్నేహితులుగా.. ఆపై ప్రేమికులుగా మారిన ఉదంతం చివరకు గొడవలతో ప్రాణాలు తీసే వరకు వెళ్లటం విషాదకరం. తెనాలిలో సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

తెనాలికి దగ్గర్లోని కొల్లిపర మండలం వల్లభపురానికి చెందిన రౌడీషీటర్ నవీన్, తెనాలికి చెందిన సమానా ఇద్దరు స్నేహితులు. శనివారం సాయంత్రం తన పుట్టిన రోజంటూ ఆమెను కారులో ఎక్కించుకొని వెళ్లాడు. గంటల వ్యవధిలో ఆమెను అపస్మారక స్థితిలో తెనాలి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చాడు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి పరారయ్యాడు. అనంతరం ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. బ్రెయిన్ డెడ్ కారణంగా ఆమె మరణించినట్లుగా వైద్యులు తేల్చారు.

ఈ నేపథ్యంలో సహానా కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ తో నవీన్ కోసం గాలింపులు జరిపిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొచ్చారు. అసలేం జరిగిందన్న అంశంపై విచారణ చేపట్టారు. తామిద్దరం కొంతకాలంగా స్నేహితులుగా ఉన్నామని.. ఆ తర్వాత ప్రేమికులుగా మారినట్లు చెప్పాడు. ఆమె పని చేస్తున్న సంస్థ నిర్వాహకుల నుంచి కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకొని దాన్ని నవీన్ కు ఇచ్చింది.

కాలం గడుస్తున్నా.. ఆమె ఇచ్చిన అప్పును నవీన తీర్చటం లేదు. దీనికి తోడు వ్యక్తిగత అంశాల మీదా ఇద్దరికి విభేదాలు తలెత్తాయి. శనివారం పుట్టిన రోజంటూ నవీన్ చెప్పటంతో కారు ఎక్కిని సహానా.. తాను అప్పుగా ఇచ్చిన మొత్తం గురించి అడగటం.. ఆ సందర్భంగా ఇరువురి మధ్య వాదన జరిగి.. మాటా మాటా అనుకున్నట్లుగా నిందితుడు పేర్కొన్నాడు. గొడవలో భాగంగా సహానాను నవీన్ కొట్టటం.. ఆమె తల డ్యాష్ బోర్డుకు తగలటంతో గాయాలయ్యాయి. కొంతకాలంగా తలనొప్పితో బాధ పడుతున్న ఆమె.. నొప్పితో గట్టిగా అరవటంతో భయపడిన నవీన్ ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చి పరారయ్యాడు. ఆ తర్వాత ఆమె కోమాలోకి వెళ్లటం.. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కన్నుమూసింది. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.

Tags:    

Similar News