'కెప్టెన్ ఇది మీ సింహాసనం'... జోయా అగర్వాల్ లైఫ్ లో రతన్ జీతో అద్భుత క్షణం!

ఈ రెండింటి మధ్యా చాలా అరుదుగా మాత్రమే కొన్ని అద్భుత జ్ఞాపకాలు ఉంటాయి.

Update: 2024-10-10 20:30 GMT

మనిషి జీవితంలో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. అందులో కొన్ని అప్పుడప్పుడూ తలచుకుని సంతోషించే తీపి జ్ఞాపకాలుగా ఉంటే.. మరికొన్ని తలచుకున్నప్పుడల్లా గుండె బరువెక్కే చేదు జ్ఞాపకాలుగా ఉంటాయి. ఈ రెండింటి మధ్యా చాలా అరుదుగా మాత్రమే కొన్ని అద్భుత జ్ఞాపకాలు ఉంటాయి.

అవి తీపి జ్ఞాపకాలుగా సంతోషాన్ని పంచవు, చేదు జ్ఞాపకాలుగా బాధనూ అందించవు... అలా అని ఆ అనుభూతిని వర్ణించే అవకాశమూ ఇవ్వవు.. ఫీలవ్వాలంతే! అలాంటి అద్భుత క్షణం తన జీవితంలోనూ ఉందంటూ.. రతన్ టాటాతో తనకున్న అనుభవాన్ని పంచుకున్నారు ఎయిరిండియా సీనియర్ పైలట్ కెప్టెన్ జోయా అగర్వాల్.

అవును... ఓ మనిషి మరణించిన తర్వాత అతడితో పాటు పాపపుణ్యాలు వెంటరాగా.. అతని విలువలు మాత్రం మిగిలిపోయి, ఎందరికో ఆదర్శంగా ఉంటాయని అంటారు. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా విలువలు తనపై ఎంతో ప్రభావం చూపాయని చెబుతూ.. తన అనుభవాన్ని పంచుకున్నారు జోయా అగర్వాల్.

ఈ సందర్భంగా... ఆనాటి సందర్భం తన మనసులో అలాగే ఉండిపోయిందని మొదలుపెట్టిన జోయా అగర్వాల్... న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తోన్న విమానంలో రతన్ జీ ప్రయాణించారని.. ఆ సమయంలో జర్నీ పూర్తైన తర్వాత ఆయన్ను ఒక ఫోటో అడిగానని తెలిపారు. ఆ సమయంలో ఆయనతో ఫోటో కోసం నిలబడినప్పుడు ఆయన రియాక్షన్ తన జీవితాన్ని మార్చేసిందని తెలిపారు.

ఇందులో భాగంగా.. ఫోటో కోసం తాను నిలిచుంటే.. ఆయన ఆపి.. "కెప్టెన్ ఇది మీ సింహాసనం.. ఇది మీరు సంపాదించుకున్నది" అని తనకు చెప్పి, తన వెనక్కి వెళ్లి ఫోటో దిగారు రతన్ టాటా అని చెప్పారు జోయా అగర్వాల్. ఆ రోజు ఆయన స్పందించిన తీరు.. తనపై ఎంతో ప్రభావాన్ని చూపిందని ఆమె ఎక్స్ వేదికగా ఫోటోతో పాటు అనుభవాన్ని పంచుకున్నారు.

Tags:    

Similar News