ఇండియాలో ఎన్నారైని ఇంటికొచ్చి కాల్చేశారు... ఏమి జరిగింది?

అమెరికాలో నివాసం ఉంటున్న సుఖ్ చైన్ సింగ్ అనే ఎన్నారైని మైనర్ పిల్లలతో కూడిన ఫ్యామిలీ ముందే దుండగులు తల, మెడపై కాల్చరు.

Update: 2024-08-26 05:23 GMT

పంజాబ్ లోని అమృత్ సర్ జిల్లాలో డబుర్జీ గ్రామంలో ఓ ఎన్నారై ని ఇద్దరు తలపాగా ధరించిన దుండగులు ఇంటివద్ద పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చిన ఘటన తీవ్ర సంచలన సృష్టించింది. అమెరికాలో నివాసం ఉంటున్న సుఖ్ చైన్ సింగ్ అనే ఎన్నారైని మైనర్ పిల్లలతో కూడిన ఫ్యామిలీ ముందే దుండగులు తల, మెడపై కాల్చరు.

అవును.. అమృత్ సర్ జిల్లాలో అత్యంత దారుణ ఘటన తెరపైకి వచ్చింది. ఓ ఎన్నారైని ఇంటివద్దే ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్చేశారు. ఆ సమయంలో మైనర్ పిల్లలు తమ చేతులు జోడించి మరీ తమ తండ్రికి హాని చేయొద్దని వేడుకున్నా కూడా దుండగులు కనికరించలేదు. రెండు రౌడ్ల కాల్పుల అనంతరం తీవ్ర గాయాలపాలైన అతడిని అమృత్ సర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

లోకల్ గ్యాంగ్స్ యాక్టివిటీస్ లో భాగంగా ఈ కాల్పులు జరిగినట్లు అనుమానుస్తుండగా.. అత్తమామలతో ఆస్తి తగాదాలు కూడా ఓ కారణం అని భావిస్తున్నారని అంటున్నారు. అయితే... ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. నేరం జరిగినప్పుడు కుటుంబం మొత్తం ఇంట్లోనే ఉంది. ఇదె సమయంలో బాధితుడిని రక్షించే ప్రయత్నం కూడా చేసింది!

సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించిన దృశ్యాల ప్రకారం... తలపాగా ధరించిన ఇద్దరు వ్యక్తులు ఉదయం ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో ఇంట్లో పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ సమయంలో ఓ దుండగుడు సదరు ఎన్నారై వద్దకు వచ్చి తుపాకీతో బెదిరిస్తూ బెడ్ రూమ్ లోకి ప్రవేశించమని అడిగాడు. ఆ సమయంలో అతడు ప్రతిఘటించడంతో అతనిపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు.

ఈ సందర్భంగా స్పందించిన అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హర్పాల్ సింగ్... ఈ సంఘటన ఉదయం 7:15 గంటలకు జరిగిందని.. ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చారని.. వారెవరు అని సుఖ్ చైన్ అడగడంతో, అనంతరం వాళ్లు గన్ తీసి బలవంతంగా లోపలికి తీసుకెళ్లడం జరిగిందని.. అతడిని అంతమొందించాలనే లక్ష్యంతోనే దుండగులు వచ్చారని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Full View
Tags:    

Similar News