అల్లు అర్జున్ సైతం 'సమతామూర్తి' బాటలో..

Update: 2022-02-12 04:28 GMT
ఆధ్యాత్మిక బాటలో అల్లు అర్జున్ నడిచాడు. సమతామూర్తిని దర్శించుకున్నారు. హైదరాబాద్ ముచ్చింతల్ లో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్న వేళ ఈ వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు, హోమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు వీవీఐపీలతోపాటు సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు.

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శ్రీరామనగరంలో సమతామూర్తిని దర్శించుకున్నారు. ముచ్చింతలకు వచ్చిన ఆయన సమతామూర్తితోపాటు దివ్యాలయాలను దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా దుత్వికులు శ్రీరామనగరంలోని సమతామూర్తితోపాటు దివ్యాలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ విశేషాలను బన్నీకి వివరించారు.

అల్లు అర్జున్ ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో జరుగుతున్న యజ్ఞక్రతువులను దగ్గరుండి చూశారు. ఆ తర్వాత త్రిదండి చినజీయర్ స్వామి ఆశీర్వాదం తీసకున్నారు. సమతామూర్తిని దర్శించుకోవడం ఎనలేని ఆనందాన్ని ఇచ్చిందని అల్లు అర్జున్ పేర్కొన్నారు.

ఆలయంలో ఉన్నంత సేపు తనువు భక్తితో పులకించిందన్నారు. సమతామూర్తిని ఎంతచూసినా తనివి తీరలేదని అల్లు అర్జున్ పేర్కొన్నారు.

ఇక బన్నీ వచ్చాడని తెలిసి అభిమానులు పోటెత్తారు. తమ అభిమాన స్టార్ ను చూసిన సెల్ఫీలు తీసుకున్నారు.
Tags:    

Similar News