విపక్షాలన్నీ తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే 2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చులు పెట్టుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. ఇటీవల, బహిష్కరణకు గురైన బీఆర్ఎస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కేసీఆర్ భారీ ఆస్తులను కూడబెట్టారని, ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కూడా అదే ఖర్చు చేస్తాడని ఆరోపించారు.
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బాంబు పేల్చారు. ఈ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ , బీజేపీ హోరాహోరీగా పోరాడాయి. అయితే రాజకీయ పరిశీలకులు దేశంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత ఖరీదైన ఉప ఎన్నికలలో ఒకటిగా దీన్ని పేర్కొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి రూ.25 కోట్లు ఆఫర్ చేశారని ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. త్వరలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ చేతులు కలుపుతాయనీ, ఆ రెండు పార్టీల డ్రామాలను తెలంగాణ ప్రజలు గుర్తించాలని ఈటెల ఆరోపించారు.
సింగరేణి కాలిరీస్, టిఎస్ఆర్టిసిని ముందుగా పటిష్టం చేయాలని సలహా ఇచ్చిన బిజెపి ఎమ్మెల్యే ఈటల విశాఖ స్టీల్ప్లాంట్కు బదులుగా స్థానికులకు విలువైన ఉపాధిని అందించే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని కెసిఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- రేవంత్ రెడ్డి కౌంటర్
కాంగ్రెస్ కు రూ.25 కోట్లు ఇచ్చిన మాట ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఈ ఆరోపణలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గట్టిగా స్పందించారు. కేసీఆర్ నుంచి, బీఆర్ఎస్ నుంచి తాము డబ్బులు తీసుకోలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కాంగ్రెస్ పార్టీదేనని ఆయన పేర్కొన్నారు. ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కాంగ్రెస్ కార్యకర్తలు సమకూర్చినదేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోని బలహీన వర్గాల నాయకులే మునుగోడు ఎన్నికలకు ఆర్థిక సాయం చేశారని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదన్నారు. బీజేపీ విశ్వసించే భాగ్య లక్ష్మీ ఆలయంలో ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు తాను వచ్చి ప్రమాణం చేస్తానని.. ఏ ఆలయంలోనైనా తడిబట్టలతో ప్రమాణం చేయడానికి రెడీ అంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
దమ్ముంటే ఆరోపించిన ఈటల రాజేందర్ సవాల్ కు వస్తారా? అంటూ కౌంటర్ ఇచ్చారు. మరి రేవంత్ సవాల్ కు ఈటల వస్తారా? భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రమాణం చేస్తారా? అన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బాంబు పేల్చారు. ఈ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ , బీజేపీ హోరాహోరీగా పోరాడాయి. అయితే రాజకీయ పరిశీలకులు దేశంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత ఖరీదైన ఉప ఎన్నికలలో ఒకటిగా దీన్ని పేర్కొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి రూ.25 కోట్లు ఆఫర్ చేశారని ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. త్వరలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ చేతులు కలుపుతాయనీ, ఆ రెండు పార్టీల డ్రామాలను తెలంగాణ ప్రజలు గుర్తించాలని ఈటెల ఆరోపించారు.
సింగరేణి కాలిరీస్, టిఎస్ఆర్టిసిని ముందుగా పటిష్టం చేయాలని సలహా ఇచ్చిన బిజెపి ఎమ్మెల్యే ఈటల విశాఖ స్టీల్ప్లాంట్కు బదులుగా స్థానికులకు విలువైన ఉపాధిని అందించే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని కెసిఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- రేవంత్ రెడ్డి కౌంటర్
కాంగ్రెస్ కు రూ.25 కోట్లు ఇచ్చిన మాట ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఈ ఆరోపణలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గట్టిగా స్పందించారు. కేసీఆర్ నుంచి, బీఆర్ఎస్ నుంచి తాము డబ్బులు తీసుకోలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కాంగ్రెస్ పార్టీదేనని ఆయన పేర్కొన్నారు. ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కాంగ్రెస్ కార్యకర్తలు సమకూర్చినదేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోని బలహీన వర్గాల నాయకులే మునుగోడు ఎన్నికలకు ఆర్థిక సాయం చేశారని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదన్నారు. బీజేపీ విశ్వసించే భాగ్య లక్ష్మీ ఆలయంలో ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు తాను వచ్చి ప్రమాణం చేస్తానని.. ఏ ఆలయంలోనైనా తడిబట్టలతో ప్రమాణం చేయడానికి రెడీ అంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
దమ్ముంటే ఆరోపించిన ఈటల రాజేందర్ సవాల్ కు వస్తారా? అంటూ కౌంటర్ ఇచ్చారు. మరి రేవంత్ సవాల్ కు ఈటల వస్తారా? భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రమాణం చేస్తారా? అన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.