Begin typing your search above and press return to search.

బాలీవుడ్ కు 2024 కష్టమేనా?

కానీ 2024లో వీరి నుంచి ఒక్క సినిమా కూడా విడుదలకు సిద్ధంగా లేదు. అందుకే బాలీవుడ్ కు 2024 హార్డ్ ఇయర్ అని సినీ పండితులు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   3 Jan 2024 3:15 AM GMT
బాలీవుడ్ కు 2024 కష్టమేనా?
X

పాన్ ఇండియా సినిమాల హవా మొదలయ్యాక బాలీవుడ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కలెక్షన్స్ కొట్టాలన్నా, రికార్డులు బద్దలు కాట్టాలన్నా అది టాలీవుడ్ డైరెక్టర్స్, హీరోలతోనే సాధ్యం అన్న పరిస్థితి ఏర్పడింది. గత రెండేళ్లుగా ఇలానే ఉంది పరిస్థితి. మరి 2024లో బాలీవుడ్ సంగతేంటి?

2023లో బాలీవుడ్ సినిమాలు కొన్ని సూపర్ హిట్ అయ్యి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. గతేడాది బీటౌన్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. పఠాన్, జవాన్ బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యి అనేక రికార్డులు సృష్టించాయి. జవాన్ ఏకంగా 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు షారుక్ డంకీ థియేటర్లలో రన్ అవుతోంది.

మరో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ కూడా యానిమల్ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. గదర్-2తో సన్నీ డియోల్ సర్ ప్రైజింగ్ హిట్ కొట్టారు. దీపావళికి టైగర్-3తో సల్మాన్ వచ్చినా సినీప్రియులను ఆ సినిమా ఆకట్టుకోలేదు. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీతో రణ్ వీర్ సింగ్ హిట్ అందుకున్నారు. వీరంతా తమ సినిమాలతో 2023లో అలరించి భారీ వసూళ్లు సాధించారు.

కానీ 2024లో వీరి నుంచి ఒక్క సినిమా కూడా విడుదలకు సిద్ధంగా లేదు. అందుకే బాలీవుడ్ కు 2024 హార్డ్ ఇయర్ అని సినీ పండితులు చెబుతున్నారు. హృతిక్ రోషన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ నటించిన చిత్రాలు మాత్రమే రిలీజ్ అవ్వనున్నాయి. వీటి ఫలితంపైనే బాలీవుడ్ 2024 భవితవ్యం ఆధారపడి ఉంది! ఆ చిత్రాలు ఏంటంటే?

బీటౌన్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ దర్శకత్వం వహిస్తున్న ఫైటర్-3 మూవీలో హీరోగా హృతిక్ రోషన్ నటిస్తున్నారు. దీపికా పదుకొణె, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రంలో హృతిక్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా క‌నిపించ‌నుండ‌గా.. స్క్వాడ్రన్ లీడర్‌ మిన్నిగా (దీపికా పదుకొణె).. గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ పాత్రలో అనిల్‌ కపూర్‌ కనిపించనున్నారు.

రోహిత్ శెట్టి, అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమా సింగం అగైన్. సింగం ఫ్రాంచైజీ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అజయ్ దేవగణ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. మరి ఈ ఏడాది బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.