Begin typing your search above and press return to search.

అంతా మర్చిపోయే టైమ్‌ కి రాబోతున్న హిట్‌ బొమ్మ!

మలయాళ విలక్షణ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'ఆడుజీవితం' వంద కోట్లకు పైగా వసూళ్లు సాదించిన విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   14 July 2024 8:48 AM GMT
అంతా మర్చిపోయే టైమ్‌ కి రాబోతున్న హిట్‌ బొమ్మ!
X

మలయాళ విలక్షణ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'ఆడుజీవితం' వంద కోట్లకు పైగా వసూళ్లు సాదించిన విషయం తెల్సిందే. ఇతర భాషల్లో ది గోట్ లైఫ్ గా విడుదల అయిన ఈ సినిమా అన్ని భాషల్లో కూడా భారీ వసూళ్లు సాధించడం ద్వారా ఈ ఏడాది మేటి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

థియేట్రికల్‌ రిలీజ్ సమయంలో చూడలేని వారు ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఓటీటీ స్ట్రీమింగ్‌ కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

బిజినెస్ ఇష్యూ కారణంగా విడుదల అయిన నాలుగు నెలల తర్వాత విడుదల అవ్వబోతుంది. ఈ మధ్య కాలంలో సినిమాలు అన్నీ కూడా విడుదల అయిన మూడు నాలుగు వారాల్లోనే స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. కానీ నాలుగు నెలల తర్వాత ఆడుజీవితం మళ్లీ రాబోతుంది.

థియేట్రికల్‌ రిలీజ్ అయిన సమయంలో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్‌ అయ్యింది. అదే సమయంలో ఓటీటీ స్ట్రీమింగ్‌ చేసి ఉంటే కచ్చితంగా పాన్‌ ఇండియా స్థాయిలో రెండు మూడు వారాల పాటు ట్రెండ్‌ లో ఉండేది. ఇప్పుడు సినిమా గురించి జనాలు మాట్లాడుకోవడం లేదు.

ఈ సమయంలో సినిమా ను ఓటీటీ లో స్ట్రీమింగ్‌ చేస్తే మళ్లీ బజ్‌ క్రియేట్‌ అయ్యేనా, ఆ సమయంలో చూడాలి అనుకున్న వారు అంతా కూడా ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చి చూస్తారా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

సలార్‌ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ నటించిన ఈ సినిమా ఓటీటీ లో కూడా కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ మలయాళ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. నెట్ ఫ్లిక్ వారు ఈ సినిమాను జులై 19న అంటే ఈ వారంలోనే స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు.