Begin typing your search above and press return to search.

ద‌ర్శ‌న్ తో అంతా జాగ్ర‌త్త‌గా ఎందుకంటే?

ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో న‌టి అనూషా రాయ్ కూడా ద‌ర్శ‌ని అండగా నిలిచింది. 'హత్య కేసులో దర్శన్‌ అరెస్ట్‌ కావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.

By:  Tupaki Desk   |   22 Jun 2024 9:39 AM GMT
ద‌ర్శ‌న్ తో అంతా జాగ్ర‌త్త‌గా ఎందుకంటే?
X

మ‌ర్డ‌ర్ కేసులో అరెస్ట్ అయిన క‌న్న‌డ న‌టుడు ద‌ర్శ‌న్ పై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ న‌డుస్తోంది. రేణుకాస్వామి కేసులో కీల‌క‌మైన వ్య‌క్తి కావ‌డంతో క‌న్న‌డ ఇండ‌స్ట్రీ స‌హా అన్ని అంత‌టా అత‌డి గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక సొంత ప‌రిశ్ర‌మ నుంచి ఆయ‌న్ని పొగిడింది ఉన్న‌వారు నిందించింది ఉన్న‌వారు. న‌టి ర‌మ్య‌నంబీస‌న్ అయితే ఉరిశిక్ష వేయాల‌ని డిమాండ్ చేసారు. న‌టి సంజ‌నా గ‌ల్రానీ ఏకంగా అత‌డిని దైవ స‌మానంగా భావిస్తున్న‌ట్లు వ్యాఖ్యానించింది.

క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి బ్లాక్ డే అని, ప్ర‌జ‌లు అతడి సినిమాలు చూడ‌ట‌మే కాద‌ని, అత‌న్ని పూజిస్తార‌ని వ్యాఖ్యానించింది. మ‌హిళ‌లంటే ఎంతో గౌర‌వంగా న‌డుచుకుంటాడ‌ని, త‌న‌ని జీ సునియే అని పిలిచేవార‌ని తెలిపింది. అలాంటి వ్య‌క్తి హ‌త్య చేసాడు అంటే న‌మ్మ‌లేక‌పోతున్నాన‌ని అంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో న‌టి అనూషా రాయ్ కూడా ద‌ర్శ‌ని అండగా నిలిచింది. 'హత్య కేసులో దర్శన్‌ అరెస్ట్‌ కావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.

దర్శన్‌ అందరినీ బాగా చూసుకుంటాడు. కాకపోతే కోపం ఎక్కువ. కోపం వస్తే ఎదుటి వ్యక్తి ఎవరైనా లెక్క చేయడు. దీంతో అందరూ అతనితో చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. నేను కూడా పరిధి దాటకుండా మాట్లాడతాను. తనకు కోపం ఎక్కువ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. అయితే దర్శన్‌కి ఈ కేసుకి సంబంధం ఉందనే విషయం మాత్రం నాకు తెలియదు.

దర్శన్‌పై కోపం ఉంటే అతన్ని ఏమైనా అనుకోండి, తిట్టుకోండి కానీ ఆయన భార్య, కొడుకుని మాత్రం తిట్టడం కరెక్ట్‌ కాదు. అలా చేస్తే క్ష‌మించ‌రాని నేరం అవుతుంది. తెలిసి తెలియ‌ని మాట‌ల‌తో ఆ కుటుంబాన్ని మ‌రింత క్షోభ‌కి గురి చేసిన‌ట్లు అవుతుంది' అని అనుష రాయ్‌ చెప్పుకొచ్చింది.