Begin typing your search above and press return to search.

ఆసుప‌త్రిలో జాన్వీ క‌పూర్..షాక్ లో ఫ్యాన్స్!

ఇంత‌లోనే జాన్వీ ఆసుప‌త్రిలో చేర‌డం చూసి అభిమానులు షాక్ తిన్నారు. క‌ల్తీ ఆహారం కార‌ణంగా అనారోగ్యానికి గుర‌వ్వ‌డంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

By:  Tupaki Desk   |   18 July 2024 1:52 PM GMT
ఆసుప‌త్రిలో జాన్వీ క‌పూర్..షాక్  లో ఫ్యాన్స్!
X

బాలీవుడ్ న‌టి జాన్వీక‌పూర్ ఆసుప‌త్రి పాలైంది. పుడ్ పాయిజ‌న్ కార‌ణంగా నేడు ముంబైలోని ఓ ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో చేరింది. క‌ల్తీ ఆహారం వ‌ల్ల క‌డుపులో ఇబ్బంది క‌ల‌గ‌డంతో చేరిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష యాన్ని జాన్వీ తండ్రి బోనీక‌పూర్ మీడియాకి వెల్ల‌డించారు. రెండు రోజుల పాటు ఆసుప‌త్రిలోనే వైద్యం తీసుకుంటుంద‌ని, అటుపై డిశ్చార్జ్ అవుతుంద‌ని తెలిపారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో తిన్న ఆహారం కార‌ణంగానే జాన్వీకి ఫుడ్ పాయిజ‌నింగ్ అయిన‌ట్లు స‌మాచారం.

ఇటీవ‌లే జాన్వీ క‌పూర్ ప్రియుడు శిఖ‌ర్ ప‌హారియాతో క‌లిసి అనంత్ అంబానీ-రాధికా మ‌ర్చెంట్ వివాహానికి హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. మూడు రోజుల పెళ్లిని జాన్వీ ద‌గ్గ‌రుండి మ‌రీ జ‌రిపించింది. ఆ వేడుక‌ల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంది. ఇంత‌లోనే జాన్వీ ఆసుప‌త్రిలో చేర‌డం చూసి అభిమానులు షాక్ తిన్నారు. క‌ల్తీ ఆహారం కార‌ణంగా అనారోగ్యానికి గుర‌వ్వ‌డంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంది. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయి ఇంటికొస్తుంది. ఇక జాన్వీక‌పూర్ హిందీ, తెలుగు సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న 'దేవ‌ర‌'లో న‌టిస్తోంది. అమ్మ‌డికిదే తొలి పాన్ ఇండియా సినిమా. ఈ సినిమా విజ‌యం సాధిస్తే జాన్వీ రేంజ్ మారిపోతుంది. అలాగే ఈ సినిమా రిలీజ్ కి ముందే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 16వ చిత్రంలోనూ ఛాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే.

అలాగే బాలీవుడ్ లో కొత్త ప్రాజెక్ట్ ల‌కు సైన్ చేసే బిజీలో ఉంది. 'స‌న్నీ సంస్కారీ కి తుల‌సీ కుమారి' లో న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. అలాగే కొత్త సినిమాల‌కు అడ్వాన్సులు అందుకుంటుంది. ఇప్ప‌టి నుంచే జాన్వీ క‌పూర్ 2025 డేట్లు కూడా లాక్ చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది.