Begin typing your search above and press return to search.

ఎంత దారుణంగా ఉన్నా నేను పట్టించుకోను

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ లో అడుగు పెట్టి చాలా కాలం అయ్యింది.

By:  Tupaki Desk   |   3 Aug 2024 2:30 PM GMT
ఎంత దారుణంగా ఉన్నా నేను పట్టించుకోను
X

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ లో అడుగు పెట్టి చాలా కాలం అయ్యింది. ఇప్పటికే అక్కడ చాలా సినిమాలు చేసింది. కానీ ఇప్పటి వరకు కమర్షియల్‌ గా బిగ్‌ బ్రేక్ ను మాత్రం అందుకోలేకపోయింది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా సిరీస్ లను కూడా ఈ అమ్మడు చేస్తున్న విషయం తెల్సిందే.

హీరోయిన్‌ గా ఈ అమ్మడు సౌత్‌ లో ముఖ్యంగా టాలీవుడ్‌ లో ఎప్పుడు అడుగు పెడుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ కి జోడీగా దేవర సినిమాను చేస్తోంది. త్వరలోనే ఈ అమ్మడు ఎన్టీఆర్‌ తో కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కెరీర్ ఆరంభం నుంచి కూడా జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. అయితే తనపై వస్తున్న విమర్శలు మరియు తనపై వచ్చే ట్రోల్స్ మీమ్స్ ను పట్టించుకోను అంటూ తేల్చి చెప్పింది. జాన్వీ కపూర్‌ తాజాగా ఉలఝ్‌ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడింది.

ఉలఝ్‌ సినిమా మీడియా సమావేశంలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ... నాకు మొదటి నుంచి కూడా సోషల్‌ మీడియా అంటే భయం. అందుకే నేను దానికి దూరంగా ఉంటున్నాను. ముఖ్యంగా రెడిట్‌ లో నా గురించి ఎక్కువ ట్రోల్స్ వస్తున్నాయని తెలిసింది.

ఇప్పటి వరకు నేను రెడిట్‌ ను చూడలేదు. కానీ నా సోదరి మాత్రం అందులో నా గురించి ఎక్కువ ట్రోల్స్ వస్తాయని చెప్పింది. నేను ఎంత దారుణంగా ట్రోల్స్ నాపై వచ్చినా కూడా పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను, ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నాను అంది.

దేవర సినిమా తో వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జాన్వీ కపూర్‌ ఆ వెంటనే రామ్‌ చరణ్‌ తో కలిసి బుచ్చి బాబు దర్శకత్వంలో ఒక సినిమాలో నటించేందుకు ఎంపిక అయ్యింది. దేవర మరియు చరణ్ మూవీలు మంచి విజయాలను సొంతం చేసుకుంటే జాన్వీ కపూర్‌ సౌత్‌ లో సెటిల్‌ అవ్వాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.