Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : ఎడారిలో క్రేజీ లేడీ షో

టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం సూపర్ స్టార్‌ మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందుతున్న 'గుంటూరు కారం' సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   3 Nov 2023 5:07 AM GMT
పిక్ టాక్ : ఎడారిలో క్రేజీ లేడీ షో
X

2018 లో మిస్ ఇండియా గా నిలిచి తన అందాలతో అలరించిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. హర్యానాకు చెందిన ఈ అమ్మడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇచట వాహనాలు నిలుపరాదు సినిమా తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. అంతకు ముందే హిందీలో ఎంట్రీ ఇచ్చినా కూడా అక్కడ సరైన గుర్తింపు లభించలేదు. కానీ తెలుగు లో ఈమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి.


టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం సూపర్ స్టార్‌ మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందుతున్న 'గుంటూరు కారం' సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే. మహేష్ బాబు సినిమాలో మాత్రమే కాకుండా విశ్వక్ సేన్ 10వ సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపిక అయింది. ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

హీరోయిన్ గా బిజీగా మారిన ఈ అమ్మడు సోషల్‌ మీడియా లో షేర్‌ చేసే ఫోటోలు మరియు వీడియోలు రెగ్యులర్ గా వైరల్‌ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఎడారిలో సంచరిస్తూ మీనాక్షి చౌదరి ఫోటోలకు ఫోజ్ ఇచ్చి కన్నుల విందు చేసింది. హొయలు పోతూ మీనాక్షి చౌదరి కెమెరాకు ఇచ్చిన ఫోజ్ లు ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఈ క్రేజీ లేడీ ఎడారి ఫోటో షూట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. విభిన్నమైన ఔట్ ఫిట్ లో మీనాక్షి చౌదరిని చూస్తూ ఉంటే ముందు ముందు విభిన్న పాత్రల్లో ఈమెను చూడబోతున్నాం అనిపిస్తోందని నెటిజన్స్ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో దాదాపుగా అరడజను సినిమాలు ఉన్నాయి. అందులో తెలుగు తో పాటు తమిళ్ సినిమాలు కూడా ఉన్నాయి. ముందు ముందు ఈ అమ్మడు స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ అవ్వడం ఖాయం అనిపిస్తోంది.