Begin typing your search above and press return to search.

వ‌న‌ప‌ర్తి ఆల‌యంలో సిద్ధార్థ్- అదితీరావ్ పెళ్లి

ప్ర‌ఖ్యాత వోగ్ ఇండియాకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అదితి రావ్ త‌న ప్రియుడు సిద్ధార్థ్ ప్రతిపాదన వెనుక ఉన్న హార్ట్ ట‌చింగ్ స్టోరీని వెల్లడించింది.

By:  Tupaki Desk   |   30 Aug 2024 12:14 PM GMT
వ‌న‌ప‌ర్తి ఆల‌యంలో సిద్ధార్థ్- అదితీరావ్ పెళ్లి
X

లవ్ బర్డ్స్ అదితి రావ్ హైదరీ - సిద్ధార్థ్ 2021లో డేటింగ్ ప్రారంభించినప్పటి నుండి నిరంత‌రం వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో వనపర్తి సమీపంలోని శ్రీరంగపురం ఆలయంలో ఈ జంట నిశ్చితార్థం చేసుకోవడం ద్వారా త‌మ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లారు. ఈ వేడుక గురించి ఇన్‌స్టాలో అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రత్యేక క్షణాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు.


ప్ర‌ఖ్యాత వోగ్ ఇండియాకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అదితి రావ్ త‌న ప్రియుడు సిద్ధార్థ్ ప్రతిపాదన వెనుక ఉన్న హార్ట్ ట‌చింగ్ స్టోరీని వెల్లడించింది. సిద్ధార్థ్ మోకాళ్లపై కూచుని నాకు ప్ర‌పోజ్ చేసాడు అని అదితీ తెలిపింది. దివంగత అమ్మమ్మ ప్రారంభించిన పాఠశాలలో ఈ అనుభ‌వం, ఘాడ‌మైన‌ సెంటిమెంట్ త‌న‌ను క‌దిలించింది. అమ్మ‌మ్మ ఆశీస్సులు ద‌క్కాల‌నే అత‌డు నాకు అలా ప్ర‌పోజ్ చేసాడ‌ని అదితీ మురిసిపోతూ చెప్పింది. కొన్నేళ్ల క్రితం మరణించిన అమ్మ‌మ్మ‌కు నేను అత్యంత సన్నిహితురాలిని. అమ్మ‌మ్మ‌ హైదరాబాద్‌లో పాఠశాలను ప్రారంభించింది. ఒక రోజు సిద్ధార్థ్ నేను ఎంత సన్నిహితంగా ఉన్నానో తెలుసుకుని, అతడిని చూడాలి అని అడిగింది`` అని అదితీ చెప్పింది. అతడు ఇదే చోట‌ మోకాలిపై కూచుని ప్ర‌పోజ్ చేసాడు అని అదితీ తెలిపింది. ప్రపోజ్ చేయ‌డంలో సిద్ధార్థ్ ఛ‌మ‌త్కారం తన‌ను విస్మ‌య‌ప‌రిచింద‌ని అదితీ తెలిపింది. ఈ చారిత్రాత్మ‌క‌ దేవాల‌యంలో సిద్ధార్థ్ ని పెళ్లి చేసుకుంటాన‌ని, త్వ‌ర‌లోనే ముహూర్తం ఫిక్స్ అయ్యాక తెలియ‌జేస్తాన‌ని కూడా అదితీ క‌న్ఫామ్ చేసింది.


రెండు రాజ వంశాలకు చెందిన రాకుమారి:

అదితీరావ్ హైద‌రీ రాజ‌వంశీకురాలు. ఒకటి కాదు.. రెండు రాజ వంశాలకు చెందిన రాకుమారి. ఆమె హైదరాబాద్‌లో ఎహసాన్ హైదరీ- విద్యారావు దంపతులకు జన్మించింది. వలస పాలనలో హైదరాబాద్ మాజీ ప్రధాని అక్బర్ హైదరీ మునిమనవరాలు. ఆమె తాత రాజా జె రామేశ్వర్ రావు వనపర్తి కుటుంబానికి చెందిన రాజా.

ఎట్ట‌కేల‌కు అదితి రావ్ హైదరీ- సిద్ధార్థ్ పెళ్లి వివరాలు తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తెలంగాణలోని వనపర్తిలో 400 ఏళ్ల నాటి ఆలయంలోనే త‌మ పెళ్లి వేడుక జరగనుందని, ఇది తన కుటుంబానికి ప్రత్యేక సెంటిమెంటుగా ఉంటుందని అదితి తెలిపారు. ఈ ఏడాది చివర్లో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉంది.

2021లో ప్రేమ క‌థ‌ మొద‌లు:

అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించిన `మహాసముద్రం`(2021) సినిమా సెట్స్‌లో సిద్ధార్థ్ - అదితి మొదటిసారి కలుసుకున్నారు. అదితి.. సిద్ధార్థ్ ఇద్ద‌రికీ ఇది రెండో పెళ్లి. అదితీ గతంలో నటుడు సత్యదీప్ మిశ్రాను పెళ్లాడారు. ఈ జంట‌ 2009 -2013 వరకు క‌లిసి ఉన్నారు. అటుపై ఈ బంధం ముగిసింది. అలాగే సిద్ధార్థ్ గ‌తంలో మేఘనాను పెళ్లాడారు. ఈ జంట 2007లో విడాకులు తీసుకున్నారు.