Begin typing your search above and press return to search.

ఇదే నిజ‌మైతే తార‌క్‌పై అత‌డు ఏం చెబుతాడు?

ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ త‌ర్వాత ఎన్టీఆర్- రాజ‌మౌళి ఒకే వేదిక‌పై క‌నిపిస్తే అభిమానుల్లోను బోలెడంత ఉత్సాహం నెల‌కొంటుంది.

By:  Tupaki Desk   |   21 Sep 2024 5:41 AM GMT
ఇదే నిజ‌మైతే తార‌క్‌పై అత‌డు ఏం చెబుతాడు?
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన 'దేవ‌ర' ఈనెల 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు భాష‌ల్లో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్, ముంబై, చెన్నై వంటి చోట్ల భారీగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఈసారి తార‌క్ ఉత్త‌రాది బెల్ట్ లోను తానేంటో చూపించాల‌ని త‌ప‌న ప‌డుతున్నాడు. ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా విజ‌యం అందుకున్న‌ త‌ర్వాత అత‌డిలో ఉత్సాహం రెట్టించింది. ఆర్.ఆర్.ఆర్ కి కానీ ఇత‌ర పాన్ ఇండియ‌న్ సినిమాల‌కు కానీ ఉత్త‌రాది క‌లెక్ష‌న్స్ కీల‌కంగా మారాయి. దీంతో ముంబైలో 'దేవ‌ర' ప్ర‌మోష‌న్స్ కోసం తార‌క్ చేయాల్సిన‌దంతా చేసాడు.

ప్ర‌చారం ప‌రంగా ఈ ప్ర‌య‌త్నం అత‌డికి క‌లిసొస్తుంది. అయితే దేవ‌ర‌కు ఇది స‌రిపోదు. ఇంకా ఇంకా ప్ర‌మోష‌న్ కావాలి. అందుకే ఇప్పుడు తార‌క్ కి అత్యంత స‌న్నిహితుడు, హితుడు అయిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళినే ప్ర‌చారానికి దించేస్తున్నారన్న టాక్ ఉంది. కొర‌టాల బృందం ఇప్ప‌టికే దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం భారీ స‌న్నాహ‌కాల్లో ఉంది. ఈ వేదిక‌పై రాజ‌మౌళి ప్ర‌త్యేక ఆకర్ష‌ణ కాబోతున్నార‌ని గుస‌గుస వినిపిస్తోంది. ఎన్టీఆర్ తో పాటు, అత‌డి ద‌ర్శ‌కులు ఈ వేదిక‌పై క‌నిపిస్తారని భావిస్తున్నారు.

అయితే ఈవెంట్లో ఎందరు ఉన్నా రాజ‌మౌళి కేంద్ర‌క ఆక‌ర్ష‌ణ‌గా మార‌తార‌న‌డంలో సందేహం లేదు. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ త‌ర్వాత ఎన్టీఆర్- రాజ‌మౌళి ఒకే వేదిక‌పై క‌నిపిస్తే అభిమానుల్లోను బోలెడంత ఉత్సాహం నెల‌కొంటుంది. ఇక ఆర్.ఆర్.ఆర్ సీక్వెల్ గురించి కానీ, లేదా ఎన్టీఆర్ గురించి కానీ ఏదో ఒక విష‌యం చెబుతారా? అన్న ఆసక్తి అభిమానుల్లో ఉండొచ్చు. రాజ‌మౌళి అలాంటి ఉత్కంఠ క‌లిగించే విష‌యాలు మాట్లాడుతారేమో చూడాలి. ఇక ఇలాంటి ఉత్కంఠభ‌రిత‌మైన వేదిక‌ల‌పై ఫ్యాన్ వార్ గురించి మాట్లాడేందుకు ఆస్కారం లేదు. ఎన్టీఆర్ తో తన త‌దుప‌రి ప్ర‌య‌త్నం ఏమిట‌న్న‌ది రాజ‌మౌళి ఒక‌వేళ చెబితే బావుంటుంద‌ని కూడా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

చ‌నిపోతా అనుకున్నా:

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ దేవ‌ర ప్ర‌మోష‌న్స్ లో ఒక ఆస‌క్తిక‌ర విష‌యం చెప్పారు. గోవాలో స‌ముద్రంలో షూటింగ్ చేసేప్పుడు సూర్యుడు న‌డి నెత్తి మీద నిప్పులు కురిపిస్తున్నాడు. ఆ సీన్ చేసేప్పుడు ఒక్క క్ష‌ణం చ‌నిపోతానేమోన‌ని భ‌య‌ప‌డ్డాన‌ని, ఆ స‌మ‌యంలో భార్యా బిడ్డ‌లు గుర్తుకొచ్చార‌ని కూడా అన్నారు. సీన్ ఇలా పూర్త‌వ్వ‌గానే అలా లుంగీ అక్క‌డే వ‌దిలేసి ఏసీ రూమ్ కి ప‌రుగెత్తుకెళ్లి బెడ్ పై వాటిపోయాన‌ని కానీ ఆ స‌మ‌యంలో క‌రెంట్ క‌ట్ అయింద‌ని కూడా తార‌క్ వెల్ల‌డించారు. ఇలాంటి క‌ష్టం ప‌గోడికి కూడా రాకూడ‌ద‌నుకున్నాన‌ని తార‌క్ అన్నారు.