Begin typing your search above and press return to search.

సైమా 2024 : ఆరాధ్య బ‌చ్చ‌న్‌పైనే క‌ళ్ల‌న్నీ

తార‌ల గ్లామ్ అండ గ్లిజ్ న‌డుమ సైమా 2024 ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా సాగాయి.

By:  Tupaki Desk   |   16 Sep 2024 3:30 PM GMT
సైమా 2024 : ఆరాధ్య బ‌చ్చ‌న్‌పైనే క‌ళ్ల‌న్నీ
X

తార‌ల గ్లామ్ అండ గ్లిజ్ న‌డుమ సైమా 2024 ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా సాగాయి. తెలుగు, క‌న్న‌డ, త‌మిళం, మ‌ల‌యాళ‌ రంగాల‌కు చెందిన ప్ర‌తిభావంతుల‌కు అవార్డులు అంద‌జేసారు. దుబాయ్‌లో జరిగిన SIIMA 2024 అహూతుల‌తో ర‌క్తి క‌ట్టించింది. వేదిక వ‌ద్ద మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ త‌న గారాల ప‌ట్టీ ఆరాధ్య బచ్చన్‌తో కలిసి కనిపించింది. అవార్డుల కార్యక్రమానికి వెళ్లే ముందు తల్లీకూతుళ్లిద్దరూ కలిసి రెడ్ కార్పెట్‌పై నడిచి కెమెరాలకు పోజులిచ్చారు. కార్పెట్‌పై ఐశ్వర్య ఆరాధ్యను ముద్దుపెట్టుకుని, త‌న చేతిని ప‌ట్టుకుని కెమెరాలకు పోజులిస్తూ క‌నిపించింది.

పొన్నియన్ సెల్వన్ 2లో నటనకు గాను ఐశ్వర్యరాయ్ ఉత్తమ నటి (విమర్శకులు)గా అవార్డును అందుకుంది. తన అవార్డును స్వీకరించడానికి సెంటర్ స్టేజ్‌కి చేరుకున్నప్పుడు, ఆరాధ్య వేదిక దిగువ‌న ప్రేక్షకుల మ‌ధ్య సెల్ ఫోన్‌లో మామ్ ఫోటోలు తీస్తూ క‌నిపించింది. ఆ క్ష‌ణం ఆ ఇద్ద‌రి సంతోషం హావ‌భావాల‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

తమిళ నటుడు చియాన్ విక్రమ్‌తో ఆరాధ్య ముచ్చ‌టిస్తున్న ఓ ఫోటో కూడా హైలైట్ గా నిలిచింది. ఐశ్వర్యరాయ్ కి ఒక వైపున ఆరాధ్య కూచుని ఉంది. మ‌రోవైపు నుంచి చియాన్ ఆరాధ్య వైపు చూస్తూ త‌న‌ను ప‌ల‌క‌రిస్తున్నారు. వైరల్ అయిన ఈ ఫోటోలో ఆరాధ్యతో అత‌డు స‌ర‌దాగా మాట్లాడుతూ క‌నిపించారు. పొన్నియిన్ సెల్వన్‌లో తన నటనకు గాను విక్ర‌మ్ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు.

ఐశ్వర్య- అభిషేక్ బచ్చన్ మధ్య స‌న్నివేశం అంతా బాగాలేదనే పుకార్లయ న‌డుమ‌ ఐశ్వర్య - ఆరాధ్య ఔటింగ్ ల్లో క‌నిపిస్తున్నారు. అభిషేక్ బచ్చన్‌తో ఐష్‌ పెళ్లయి 17 ఏళ్లు పూర్త‌య్యాయి. ఇప్ప‌టికి ఆ ఇద్ద‌రి న‌డుమా ఏం జ‌రుగుతోందో అర్థం కాని ప‌రిస్థితి. ఈ ఏడాది జూలైలో అభిషేక్ బచ్చన్ లేకుండా రెడ్ కార్పెట్‌పై కనిపించినప్పుడు భ‌ర్త నుంచి విడిపోతోంద‌ని పుకార్లకు దారితీసింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అంబానీ వివాహానికి ఐశ్వర్య, అభిషేక్ హాజరయ్యారు. అయితే విడివిడిగా వెన్యూ వ‌ద్ద‌కు ఎంట్రీ ఇచ్చారు. వారు కళ్యాణ మండపంలో తిరిగి కలిశారు కానీ వివాహం ముగిసిన వెంటనే అభిషేక్ లేకుండానే ఐశ్వర్య వెకేష‌న్ కోసం బయలుదేరింది. ఇది మ‌రోసారి సందేహాల‌ను రాజేసింది. అలాగే అంత‌ర్జాలంలో విడాకుల గురించిన పోస్ట్‌ను అభిషేక్ `లైక్` చేయడంతో అది మ‌రింత‌గా ఊహాగానాలకు ఆజ్యం పోసింది. దీనిపై బాలీవుడ్ మీడియా రెగ్యుల‌ర్ క‌థ‌నాలతో ఊద‌ర‌గొడుతోంది.