Begin typing your search above and press return to search.

ఐశ్వర్యతో సాయి ధరమ్‌ సంబరాల కథ ఏంటి..?

విరూపాక్ష హిట్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తాడు అనుకున్న సాయి ధరమ్‌ తేజ్‌ అనూహ్యంగా గ్యాప్ తీసుకున్నాడు

By:  Tupaki Desk   |   25 Jun 2024 4:02 PM GMT
ఐశ్వర్యతో సాయి ధరమ్‌ సంబరాల కథ ఏంటి..?
X

విరూపాక్ష హిట్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తాడు అనుకున్న సాయి ధరమ్‌ తేజ్‌ అనూహ్యంగా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో బ్రో సినిమాలో కనిపించినా కూడా అది పవన్ కళ్యాణ్ సినిమాగానే లెక్కలోకి వెళ్లి పోయింది. అందుకే సాయి ధరమ్‌ తేజ్ కొత్త సినిమాకు చాలా సమయం తీసుకున్నట్లయ్యింది.

ఇటీవలే సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. రోహిత్‌ కేపీ దర్శకత్వంలో పీరియాడిక్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ ఇప్పటికే ఆమె షూటింగ్‌ లో పాల్గొంటుందనే వార్తలు వస్తున్నాయి.

1947 కాలంలో సాగే ఒక కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సంబరాల ఏటి గట్టు అనే విభిన్నమైన టైటిల్‌ ను ఈ సినిమాకు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆ టైటిల్‌ ను రిజిస్టర్ చేయించారనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

విరూపాక్ష హిట్ నేపథ్యంలో తేజ్ సినిమాలకు మంచి బజ్ క్రియేట్‌ అయ్యింది. అందుకే ఈ సినిమాకు మంచి బిజినెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే కాస్త ఎక్కువ బడ్జెట్‌ తోనే ఈ సినిమాను రూపొందిస్తున్నారు అంటూ మెగా కాంపౌండ్‌ నుంచి సమాచారం అందుతోంది.

ప్రస్తుతం హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో వేసిన ఒక విలేజ్ సెట్‌ లో సాయి ధరమ్‌ తేజ్ తో పాటు హీరోయిన్‌ ఐశ్వర్య లక్ష్మి లు సంబరాలకు సంబంధించిన షూటింగ్‌ లో పాల్గొంటున్నారని సమాచారం అందుతోంది. ఏ క్షణంలో అయినా ఈ సినిమా యొక్క అఫిషియల్‌ అనౌన్స్మెంట్‌ తో పాటు, ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ లేదా గ్లిమ్స్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.