Begin typing your search above and press return to search.

గుండెల్ని క‌రిగించిన ఐశ్వ‌ర్యారాయ్ కంట త‌డి

ఒక NGO కోసం ఒక సామాజిక కార్యక్రమం చేస్తుండ‌గా, అక్కడ ఐశ్వ‌ర్యారాయ్ కొంతమంది పిల్లలను సందర్శించింది.

By:  Tupaki Desk   |   6 Oct 2024 3:41 AM GMT
గుండెల్ని క‌రిగించిన ఐశ్వ‌ర్యారాయ్ కంట త‌డి
X

అందానికి ప్రతిరూపం ఐశ్వ‌ర్యారాయ్. మాజీ ప్రపంచ సుందరి ఎప్ప‌టికీ అభిమానుల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచి ఉంది. ప్రశాంతవ‌ద‌నంతో ఐశ్వర్యకు బలమైన పాయింట్‌ని ఎలా చెప్పాలో త‌న అభిప్రాయాలను ఎలా వ్యక్తీకరించాలో తెలుసు. కొన్ని సంవత్సరాల క్రితం ఐశ్వర్య ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు.. స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్లు మితిమీరిన ప్ర‌వ‌ర్త‌న త‌న‌ను తీవ్రంగా కలవరపెట్టింది. ఒక NGO కోసం ఒక సామాజిక కార్యక్రమం చేస్తుండ‌గా, అక్కడ ఐశ్వ‌ర్యారాయ్ కొంతమంది పిల్లలను సందర్శించింది.

ఈ సంఘటన ఐశ్వర్యకు దిమ్మతిరిగేలా మారింది. ఫోటోగ్రాఫ‌ర్లు గ్యాప్ ఇవ్వ‌కుండా త‌న‌ చుట్టూ తిరుగుతున్నారు. ఆ గొడవకు పిల్లలు భ‌య‌ప‌డుతుంటే.. ఐష్‌ ఆగలేక ఫోటోగ్రాఫర్‌లపై సీరియ‌స్ అయింది. తాను కూడా కన్నీళ్లు పెట్టుకుంది. వారిని ప్రశాంతంగా ఉండమని కోరింది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోలో ఐష్ క‌న్నీటిప‌ర్యంతం అవ్వ‌డం హృద‌యాల‌ను తాకుతోంది. ``దయచేసి శాంతించండి. ఇది ఏదో సినిమా ఈవెంట్ లేదా ప్రీమియర్ కాదు. వీరు పిల్లలు. వారికి మన ప్రపంచం తెలియదు`` అని ఆందోళ‌న చెందారు. ఈ కార్యక్రమంలో ఐష్ తన కుమార్తె ఆరాధ్యతో కలిసి ఉన్నారు. సందర్శన సమయంలో స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్లు ఒక పిల్లవాడిని భయపెట్టారు. అతడు ఏడుపు ప్రారంభించాడు. దీంతో ఐశ్వర్య తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆమె బ‌య‌ట‌కు కనిపించే విధంగా కలత చెందింది. ఫోటోగ్రాఫ‌ర్ల‌పై సీరియ‌స్ అవుతూ.. ``మీ అందరికీ ఏమైంది? వారు పిల్లలు, దయచేసి వినయంగా ఉండండి! అని వ్యాఖ్యానించింది.

ఆ స‌మ‌యంలో ఐశ్వర్యరాయ్ తన అంద‌మైన మ‌న‌సు, హావభావాలతో హృదయాలను గెలుచుకుంది. తన బలహీనతను కెమెరా ముందు చూపించడానికి భేష‌జానికి పోలేదు. పిల్లలపై ఐష్ ప్రేమ‌, సున్నిత‌త్వాన్ని ఈ ఘ‌ట‌న బ‌హిర్గ‌తం చేసింది. ఇటీవల ఐశ్వర్య రాయ్, ఆమె కుమార్తె ఆరాధ్య దుబాయ్‌లో జరిగిన IIFA 2024 అవార్డులకు హాజరయ్యారు. ఈవెంట్ తర్వాత UAE నుండి తిరిగి వచ్చినప్పుడు తల్లీ-కూతుళ్లిద్దరూ ఎయిర్‌పోర్టు వెలుపల చేయి చేయి పట్టుకుని క‌నిపించారు. ఆరాధ్య కంటే జీవితంలో త‌న‌కు ఇంకేదీ ముఖ్యం కాద‌ని ఐశ్వ‌ర్యారాయ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే...ఐశ్వ‌ర్యారాయ్ చివరిగా మణిరత్నం `పొన్నియిన్ సెల్వన్ II` లో కనిపించింది. కొన్నేళ్లుగా ఐశ్వర్య సినిమాలను ఎంచుకోవడంలో చాలా సెలెక్టివ్‌గా ఉంది. కానీ త‌న అభిమానులు వెనువెంట‌నే ఐష్ ని పెద్ద తెరపై చూడాలని ఆశిస్తున్నారు. వారు ఎప్ప‌టికీ త‌మ ఆరాధ్య దేవ‌త‌ను ప్రేమిస్తూనే ఉన్నారు.